ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాదీ: అందుకే గుర్తింపు
తెలుగు యువకుడి సత్తా అంతర్జాతీయంగా మరోసారి వెలుగు చూసింది. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో హైదరాబాద్కు చెందిన రోహిత్ పోతుకూచి చోటు దక్కించుకున్నారు.
హైదరాబాద్: తెలుగు యువకుడి సత్తా అంతర్జాతీయంగా మరోసారి వెలుగు చూసింది. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో హైదరాబాద్కు చెందిన రోహిత్ పోతుకూచి చోటు దక్కించుకున్నారు.
ప్రస్తుత ప్రపంచాన్ని ప్రభావితం చేసే యువ పారిశ్రామికవేత్తలు, సృజనశీలురు, నాయకులను ఫోర్బ్స్ ఈ జాబితాలో ఎంపిక చేస్తుంది. స్టాండర్డ్ ఇండియన్ లీగల్ సైటేషన్ (ఎస్ఐఎల్సీ)ను రోహిత్ స్థాపించారు.
న్యాయ విద్యకు సంబంధించి ఆయన రాసిన డాక్యుమెంటేషన్, రీసెర్చ్ను హార్వ్ర్డ్ లా స్కూల్ గుర్తించింది. అంతేకాదు దానిని దేశ వ్యాప్తంగా 300కు పైగా లా స్కూళ్లలో ఉపయోగిస్తుండటం గమనార్హం. రోహిత్ 2013లో హైదరాబాద్ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు.
తెలుగువాడైన రోహిత్తో పాటు మరో యువకుడు భారత యువకుడు కూడా ఇందులో చోటు దక్కించుకున్నాడు. అతని పేరు హృషికేష్ దాతర్. ఇతను వకీల్ సెర్చ్ డాట్ కామ్ స్థాపించారు.
హృషికేష్ ఎన్ఎల్ఎస్ఐయూ బెంగళూరు గ్రాడ్యుయేట్. ఇతను వకీల్ సెర్చ్ను 2011లో స్థాపించారు. లీగల్ సర్వీస్ కామన్ మ్యాన్కు కూడా తక్కువ ఖర్చుతో అందాలని దీనిని స్థాపించారు.