ఖైరతాబాద్ మహాగణపతికి భక్తజన తాకడి: దర్శించుకున్న లక్షమంది(పిక్చర్స్)
హైదరాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన త్రిశక్తిమయ మోక్ష గణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్లలో ఉండి గణనాథుడ్ని దర్శించుకున్నారు.
ఆదివారం సెలవు కావడంతో నగరం నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు జనసందోహంగా మారాయి. రెండు తెలుగురాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు మహా గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఆదివారం ఒక్కరోజే సుమారు లక్షమంది వరకు భక్తులు గణనాథున్ని దర్శించుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రతి భక్తుడు 59 అడుగుల ఎత్తులో కొలువుదీరిన గణపతి ప్రతిమను తమ సెల్ఫోన్లలో బంధిస్తూ ఆనందంగా గడిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని ఉత్సవ కమిటీ పేర్కొంది.
దర్శించుకోవడానికి వచ్చే భక్తులు, తమ పిల్లలు, వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానిత వస్తువులుగాని, అనుమానస్పదంగా వ్యక్తులు గాని కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఖైరతాబాద్ మహాగణపతి
ఖైరతాబాద్లో కొలువుదీరిన త్రిశక్తిమయ మోక్ష గణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్లలో ఉండి గణనాథుడ్ని దర్శించుకున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి
ఆదివారం సెలవు కావడంతో నగరం నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు జనసందోహంగా మారాయి.
ఖైరతాబాద్ మహాగణపతి
రెండు తెలుగురాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు మహా గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
ఖైరతాబాద్ మహాగణపతి
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడి వద్దకు పలు దేశాలకు చెందిన భక్తులు ఇక్కడికి చేరుకొని గణపతి గొప్పతనాన్ని, ఖైరతాబాద్ వినాయకుడికి ఉన్న మహిమలను, చరిత్రను తెలుసుకునేందుకు క్యూలైన్లలో ఉన్న భక్తులతో ముచ్చటించారు.
ఖైరతాబాద్ మహాగణపతి
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ మహాగణపతి
ఆదివారం ఒక్కరోజే సుమారు లక్షమంది వరకు భక్తులు గణనాథున్ని దర్శించుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి
ప్రతి భక్తుడు 59 అడుగుల ఎత్తులో కొలువుదీరిన గణపతి ప్రతిమను తమ సెల్ఫోన్లలో బంధిస్తూ ఆనందంగా గడిపారు.
ఖైరతాబాద్ మహాగణపతి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నామని ఉత్సవ కమిటీ పేర్కొంది.
ఖైరతాబాద్ మహాగణపతి
దర్శించుకోవడానికి వచ్చే భక్తులు, తమ పిల్లలు, వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి
అనుమానిత వస్తువులుగాని, అనుమానస్పదంగా వ్యక్తులు గాని కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.