కోతిని మింగిన ఆకలి తీరలేదు, ప్రాణాలు కూడ దక్కలేదు
ఖమ్మం:ఆకలిని తీర్చుకొనేందుకు ఎంతపనైనా చేసుకొనేందుకు వెనుకాడరు. మనుషులతో పాటు జంతువులకు కూడ ఇది వర్తిస్తోంది. ఓ కొండ చిలువ తన ఆకలిని తీర్చుకొనేందుకు చేసిన ప్రయత్నం పలించకపోగా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది.
ఆకలి బాద మనుషులతో పాటు జంతువులకు కూడ ఇబ్బందిని కల్గిస్తోంది. ఖమ్మం జిల్లాలో ఓ కొండ చిలువ ఆకలిని తీర్చుకొనేందుకు చేసిన ప్రయత్నం ప్రాణాలు కోల్పోయేలా చేసింది.
ఖమ్మం రూరల్ మండలం తెల్ధార్ పల్లిలో ఓ కొండ చిలువ తన ఆకలిని తీర్చుకొనేందుకుగాను కోతిని మింగేసింది. ఈ కోతిని మింగలేక ఆ కొండ చిలువ అవస్థలు పడింది. అవస్థలు పడుతున్న కొండచిలువను స్థానికులు గుర్తించారు.
కొండచిలువ చెర నుండి కోతిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో కొండ చిలువను చంపేశారు స్థానికులు. కొండ చిలువ చనిపోయింది.కోతి కూడ పాము చేతిలో కోతి కూడ చనిపోయింది. ఆకలి బాద రెండింటి ప్రాణాలు తీశాయి.