ప్రేమించి, చంపేశాడు: ప్రియాంక అవశేషాలు లభ్యం, ఇద్దరు పిల్లలు క్షేమం
నల్గొండ: ఇంట్లోవారికి తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకొని, మూడేళ్లకే భర్త చితేలో దారుణ హత్యకు గురైన ప్రియాంక అవశేషాలు శనివారం లభ్యమయ్యాయి. ఆమె పిల్లలు క్షేమంగానే ఉన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం వెంకేపల్లి గ్రామానికి చెందిన హన్మంతు నార్కట్పల్లి మాండ్ర గ్రామానికి చెందిన ప్రియాంకను ప్రేమించి, పెళ్లి చేసుకొని, మూడేళ్ల తర్వాత హతమార్చిన విషయం తెలిసిందే.
ప్రేమించి వస్తే 'ఆమె'ను సమాధి చేశాడు, మరో పెళ్లి చేసుకుని.: ఆమె సోదరుడి అన్వేషణతో ఘోరం వెలుగులోకి
పుర్రె, తల వెంట్రుకలు, చెప్పులు లభ్యం
మృతురాలి సోదరుడు ఉపేందర్ ఫిర్యాదుతో రెండు రోజుల క్రితం ఈ ఘోరం వెలుగు చూసింది. పుర్రె, తల వెంట్రుకలు, చెప్పులు, సెల్ ఫోన్ లభ్యమయ్యాయి. పోస్టుమార్టం అనంతరం వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించారు.
సురక్షితంగా ఉన్న పిల్లలు
ప్రియాంక ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఆమె కుమారుడు రామ్ చరణ్ కొండమల్లేపల్లిలో బంధువుల వద్ద పెరుగుతుండగా, హైదరాబాద్ బైరామల్గూడలో స్థిరపడిన నాగర్కర్నూల్ జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లికి చెందిన దంపతులు కుమార్తెను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం చిన్నారి హాలియాలోని ఓ ప్రయివేటు స్కూల్లో చదువుతోంది. నిందితుడిని అరెస్టు చేశారు.
నాడు కలిసిన సోదరుడు
ప్రియాంకను హన్మంతు పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు మూడేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత బయటకు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక భర్తతో కలిసి ఎక్కడున్నది తల్లిదండ్రులు, సోదరుడికి ఇటీవలి వరకు తెలియదు. ప్రియాంక, హన్మంతులకు పాప, బాబు పిల్లలు. రెండోసారి గర్భవతి ఉన్న సమయంలో అక్క ప్రియాంకను హైదరాబాద్లో తమ్ముడు ఉపేందర్ కలుసుకున్నాడు. ఆ తర్వాత ప్రియాంక ఆచూకీ దొరకలేదు.
Recommended Video
మరో పెళ్లి చేసుకొని హత్య
2009లో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. అప్పటి నుండి తమ్ముడు ఉపేందర్ అక్కకోసం వెతుకుతున్నాడు. మూడేళ్ల క్రితం అక్క, బావల ఫోటోను ఫేస్బుక్లో చూసి గుర్తించాడు తమ్ముడు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం వెతకనారంభించాడు. ఆ తర్వాత అక్కను చంపి బావిలో పడేశాడని తెలుసుకొని కన్నీరుమున్నీరయ్యాడు. అయితే మరో పెళ్లి చేసుకొని.. ప్రియాంకను వదిలించుకునేందుకు హత్య చేశాడు.