డ్రగ్స్ కేసు: నోరు విప్పేనా సినీ ప్రముఖులు, గుట్టువీడేనా?
టాలీవుడ్ను ఓ కుదుపు కుదుపుతున్న డ్రగ్స్ కేసులో బుదవారం నుండి విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో అనుమానితులను ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు సినీ ప్రముఖులకు నోటీసులను పం
హైదరాబాద్: టాలీవుడ్ను ఓ కుదుపు కుదుపుతున్న డ్రగ్స్ కేసులో బుదవారం నుండి విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో అనుమానితులను ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు సినీ ప్రముఖులకు నోటీసులను పంపారు.
ఈ నెల19వ, తేది నుండి ఈ నెల 27వ, తేదివరకు ప్రతిరోజూ ఒక్కో సిని రంగానికి చెందిన ప్రముఖుడిని ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. అయితే సినీ నటి ముమైత్ఖాన్ మినహ ఇతరులంతా కూడ విచారణకు హజరుకానున్నట్టు చెప్పారని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ప్రకటించారు.
డ్రగ్స్ సరఫరాచేసిన కెల్విన్ కాల్లిస్ట్ ఆధారంగా తెలంగాణ ఎక్సైజ్శాఖాధికారులు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19వ, తేదిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, 20న, హీరోయిన్ ఛార్మీ, 22న, నటుడు సుబ్బరాజు, 23న, ప్రముఖ కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు హజరుకానున్నారు. ఈ నెల 24న, హీరో రవితేజ హజరుకానున్నారు. ఈ నెల 25న, ఆర్ట్ డైరె్కటర్ చిన్నా, 26న, హీరో నవదీప్ , 27న, హీరో తరుణ్, 28న, యువహీరో తనీష్, నందులను విచారించనున్నారు.