బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు, కారణమిదే
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదైంది. రామమందిర నిర్మాణం విషయమై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎంబిటి అంజదుల్లా ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్:బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనపై కేసు నమోదైంది. రామమందిర నిర్మాణం విషయమై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎంబిటి అంజదుల్లా ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఎంబిటి నాయకుడు అంజదుల్లాఖాన్ ఢబీర్ పురా పోలీసులను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశాడు.శ్రీరామనవవిు సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ప్రజలను రెచ్చగొట్టేవిధంగా పాతబస్తీలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ప్రసంగానికి చెందిన సిడిని కూడ ఆయన తన ఫిర్యాదులో పోలీసులకు అందజేశారు.
అయితే ఎంబిటి ఫిర్యాదు మేరకు న్యాయసలహా తీసుకొన్న తర్వాత కేసును నమోదుచేసినట్టుగా ఢబీర్ పురా సిఐ వెంకన్న నాయక్ చెప్పారు.అయితే ఈ కేసును షహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయాలా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తామన్నారాయన.
రాజాసింగ్ వివాదాస్పద ప్రసంగంపై అంజదుల్లాఖాన్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రాజాసింగ్ పై చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.అంతేకాదు పోలీసులు ఎందుకు స్పందించడం లేదన్నారు.రాజాసింగ్ చేసిన వివాదాస్పద ప్రకటన అంశాలను ఆయన ప్రస్తావించారు.