గదిలో బంధించి, సింగపూర్లో హైదరాబాద్ వ్యాపారి హత్య, రూ.3 కోట్లు డిమాండ్
సింగపూర్లో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు కుషాయిగూడకు చెందిన వాసుదేవరావుగా గుర్తించారు.
హైదరాబాద్: సింగపూర్లో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. మృతుడు కుషాయిగూడకు చెందిన వాసుదేవరావుగా గుర్తించారు.
ఆయన కుషాయిగూడలో వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం పేరుతోనే దుండగులు ఆయనను సింగపూర్ రప్పించుకున్నారు. అక్కడకు వెళ్లాక ఆయనను ఓ గదిలో బంధించారు.
అనంతరం హైదరాబాదులోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సింగపూర్ నుంచి ఫోన్ చేశారు. వాసుదేవరావును మేం బంధించామని, అతనిని విడిచిపెట్టాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే అంతగా ఉన్నవాళ్లం కాదని, అంత ఇచ్చుకోలేమని బాధితులు చెప్పారు. ఈ మేరకు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేశారు. ఆ తర్వాత దుండగులు ఆయనను హత్య చేశారు. ఈ పని చేసింది సింగపూర్కు చెందినవారా, ఇక్కడి వారా తేలాల్సి ఉంది.
Comments
hyderabad singapore kill murder businessman kushaiguda హైదరాబాద్ సింగపూర్ హత్య మృతి వ్యాపారవేత్త బిజినెస్మెన్
English summary
hyderabad business Vasudev Rao killed in singapore. Kidnappers demanded for Rs 3 crores for his release.
Story first published: Friday, November 10, 2017, 12:13 [IST]