మద్యం మత్తులో దాడి: కార్పొరేటర్ కుమాడితోపాటు నలుగురి అరెస్ట్
సెప్టెంబర్ 4న అర్ధరాత్రి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జున్ థియేటర్ సమీపంలో సిరి టిఫిన్ సెంటర్వద్ద ఓ వ్యక్తిపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: సెప్టెంబర్ 4న అర్ధరాత్రి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్జున్ థియేటర్ సమీపంలో సిరి టిఫిన్ సెంటర్వద్ద ఓ వ్యక్తిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ గొడవకు సంబంధించిన కేసులో ఆల్విన్కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్గౌడ్ కుమారుడు, అతని స్నేహితులను గురువారం పోలీసులు అరెస్టుచేశారు.
సీఐ కుశాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత సోమవారం అర్ధరాత్రి మణిదీప్, సింగయ్య, శ్రీధర్బాబు, సతీష్, జైకృష్ణ హేమంత్, ఇతర స్నేహితులతో కలిసి ఐడీఎల్ చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేసి సిరి టిఫిన్ సెంటర్లో టీ తాగడానికి వెళ్లారు.
తిరిగి వెళ్లే క్రమంలో నడిరోడ్డులో ఓ కారు నిలిపి ఉంది. దానిని పక్కకు తీయాలని వీరు కోరారు. దీంతో ఆ కారులోపల ఉన్న ఆల్విన్కాలనీకి చెందిన దొడ్ల రామకృష్ణ గౌడ్, సేవర్తి నర్సింహాచారి, అర్రోజు చాణిక్య, పాకలొల్ల శివకుమార్ మద్యం మత్తులో వారిని తిట్టడంతోపై తీవ్రంగా దాడి చేశారు.
దీంతో పలువురికి గాయలయ్యాయి. బాధితులు సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందారు. కాగా, సీసీ కెమెరాల పుటేజీలు, స్థానికంగా సేకరించిన సాక్ష్యాల ఆధారంగా గొడవకి కారణమైన నలుగురుని అరెస్టుచేసినట్లు సీఐ చెప్పారు.