డ్రగ్ కేసు మరో ఇద్దరు హీరోలు, ప్రముఖ హీరో చుట్టు ఉచ్చు, బుల్లితెరకూ లింక్?
: డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు యువ నటుల చుట్టూ ఉచ్చు బిగిస్తోందని తెలుస్తోంది. అందులో ఒకరు ఓ భారీ చిత్రంలో విలన్గా నటించినట్లుగా చెబుతున్నారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు యువ నటుల చుట్టూ ఉచ్చు బిగిస్తోందని తెలుస్తోంది. అందులో ఒకరు ఓ పెద్ద చిత్రంలో విలన్గా నటించినట్లుగా చెబుతున్నారు.
చదవండి: ఆ కల్చర్ మీరే తెచ్చారట.. పొరపాటున తీసుకున్నా: వీడియో ఆధారాలతో తరుణ్కు షాక్, 13 గం. విచారణ
ప్రముఖ నిర్మాత కుటుంబానికి చెందిన ఈ హీరో పేరు గతంలోనూ డ్రగ్స్ కేసులో ఓసారి తెర పైకి వచ్చింది. హైదరాబాద్ పశ్చిమ మండలంలో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నప్పుడు అతని పేరు వచ్చింది. అప్పుడు సాక్ష్యాలు లభించలేదు.
ఇప్పుడు కెల్విన్ నుంచి పూరీ జగన్నాథ్, శ్యామ్ కె నాయుడు, సుబ్బరాజు, తరుణ్ల విచారణ అనంతరం అతని పేరు ప్రముఖంగా వినిపిస్తోందనే ప్రచారం సాగుతోంది.
తొలి జాబితాలో నోటీసులు పొందిన వారి విచారణ ఆగస్టు 2 వరకూ సాగనుంది. రెండో జాబితాలో విచారణను ఎదుర్కొనే వారిలో ఇతనే చాలా కీలకమైన వ్యక్తిగా సిట్ అధికారులు భావిస్తున్నారు.
అతనితో పాటు యువతలో క్రేజ్ సంపాదించుకున్న మరో హీరోకూ వచ్చే వారం నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
డ్రగ్స్ కేసులో అరెస్టయిన జాక్ సినిమా రంగానికి చెందిన మరి కొందరి పేర్లను శనివారం వెల్లడించడంతో ఆ ఇద్దరు హీరోల పేర్లు వెలుగు చూశాయని తెలుస్తోంది. విచారణలో బుల్లి తెర లింక్లు కూడా బయటపడుతున్నాయని తెలుస్తోంది.
కెల్విన్తోపాటు అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న జీషన్ అలీ అలియాస్ జాక్ను ఎక్సైట్ అధికారులు శనివారం తమ అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అతను కొత్తగా పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించాడని సమాచారం. ఇందులో భాగంగా సదరు ఇద్దరు యువ నటుల పేర్లు వెల్లడించాడని తెలుస్తోంది.