నేడు సుబ్బరాజు: ఓపిగ్గా.. పూరీ జగన్నాథ్ ముందే సిద్ధం!, అలా షాకింగ్ వాస్తవాలు
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటుడు సుబ్బరాజును సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) శుక్రవారం విచారించనుంది.
హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటుడు సుబ్బరాజును సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) శుక్రవారం విచారించనుంది.
ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడును విచారించారు. మూడో రోజు సుబ్బరాజును విచారిస్తున్నారు.
హైదరాబాద్ వదలొద్దు: శ్యాంకు సిట్, సహకరిస్తే సరే.. సినీస్టార్స్కు హెచ్చరిక
నిబ్బరంగా పూరీ జగన్నాథ్
విచారణ నిమిత్తం ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన పూరీ జగన్నాథ్ చాలా నిబ్బరంగా కనిపించాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పాడని తెలుస్తోంది. పలుమార్లు అధికారులు ఆయనకు ఆధారాలు చూపించి, ఇరకాటంలో పడేశారు. అప్పుడు మినహా మిగిలిన సందర్భాల్లో నిబ్బంగా సమాధానం చెప్పాడనితెలుస్తోంది.
Recommended Video
రాత్రి వరకు ఓపిగ్గా..
దీనిని బట్టి చూస్తుంటే ముందుగానే పూరీ మానసికంగా సన్నద్ధమైనట్లు అధికారులు భావిస్తున్నారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత కూడా ఒప్పిగ్గానే ఉన్నాడని, తమకు సహకరించాడని అధికారులు చెబుతున్నారు. కాగా పూరీకి చెందిన రక్త నమూనాలు, వెంట్రుకలు, గోళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం వాటిని రెడ్హిల్స్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. శ్యామ్ కె నాయుడు కూడా నిబ్బరంగానే సమాధానం చెప్పారని తెలుస్తోంది.
శ్యామ్ కె నాయుడు అలా చెప్పారా
డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖులను విచారిస్తున్న పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తనకు సిగిరెట్ తాగే అలవాటు కూడా లేదని, డ్రగ్స్ ఎందుకు వాడుతారో కూడా తెలియదని శ్యామ్ కే నాయుడు విచారణ సందర్భంగా చెప్పారని, అలా చెప్పగానే అధికారులు నవ్వారని తెలుస్తోంది. అనంతరం తమకు అంతా తెలుసని, ఎవరు ఏం తీసుకుంటారో, తీసుకోరో కూడా తమకు తెలుసని అధికారులు చెప్పారని సమాచారం.
అలా మరిన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు
ఇందుకు సంబంధించి వివరాలు అతని ముందు పెట్టడంతో శ్యామ్ కె నాయుడు అవాక్కయ్యారని, సినిమా షూటింగ్ సమయంలో తాను డ్రగ్స్ చూశానని చెప్పగా, ఒక పార్టీలో ఆయన ఉన్న ఫోటోలు కూడా చూపించడంతో శ్యామ్ కే నాయుడు మరిన్ని వివరాలు చెప్పారని తెలుస్తోంది.