కలాంకు 'హైదరాబాద్' నివాళి: బాబు ఆవేదన, జగన్ కూడా(పిక్చర్స్)
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పార్థివదేహం ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురైకి తరలించారు. కలాం పార్థివదేహాన్ని ముందుగా 10 రాజాజీ మార్గ్లోని కలాం నివాసం నుంచి పాలం విమానాశ్రయానికి రక్షణ శాఖ అధికారులు తరలించారు.
అక్కడ గౌరవ వందనం చేసిన అనంతరం ఎయిర్ ఫోర్స్కు చెందిన ప్రత్యేక విమానంలో మధురైకి తరలించారు. కేంద్రమంత్రులు వెంక్యనాయుడు, మనోహర్ పారికర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరిద్దరూ కలాం పార్థివ దేహంతో పాటే తమిళనాడు వెళ్లారు.
ఈ రోజు ఏడు గంటల వరకు ప్రజల సందర్శనార్థం కలాం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. గురువారం ఉదయం పదిన్నరకు అంత్యక్రియలు జరుగుతాయి. మధురైలో తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులు నివాళులు అర్పించనున్నారు. కలాంకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు.
కలాంకు నివాళి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రెండు రోజుల క్రితం షిల్లాంగ్లు మృతి చెందారు. ఆయనకు హైదరాబాదులోని సెయింట్ పాల్స్ పాఠశాలలో విద్యార్థుల నివాళి.
కలాంకు నివాళి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రెండు రోజుల క్రితం షిల్లాంగ్లు మృతి చెందారు. ఆయనకు హైదరాబాదులోని సెయింట్ పాల్స్ పాఠశాలలో విద్యార్థుల నివాళి.
కలాంతో అనుబంధం గుర్తు చేసుకున్న చంద్రబాబు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సంతాపం వ్యక్తం చేశారు. కలాంతో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మంగళవారం ఆయన సచివాలయం వద్ద మాట్లాడారు.
కలాంతో అనుబంధం గుర్తు చేసుకున్న చంద్రబాబు
శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా కలాం దేసానికి విశిష్ట సేవలు అందించారన్నారు. ఆత్మీయ వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి రాష్ట్రపతిగా ఎదిగారన్నారు. నీతి, నిజాయితీగా పట్టుదలతో కలాం పని చేశారన్నారు.
అబ్దుల్ కలాం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రెండు రోజుల క్రితం షిల్లాంగ్లు మృతి చెందారు. ఆయనకు హైదరాబాదులోని పాతబస్తీలో నివాళి.
కలాంకు నివాళి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రెండు రోజుల క్రితం షిల్లాంగ్లు మృతి చెందారు. ఆయనకు హైదరాబాదులో పోలీసులు నివాళి అర్పిస్తూ...
కలాంకు నివాళి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రెండు రోజుల క్రితం షిల్లాంగ్లు మృతి చెందారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్, ఇతర నేతలు.