వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతికుండగానే తల్లిని చంపేశాడు, తల్లి ఏం చేసిందంటే?

తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లి చనిపోయిందంటూ డెత్ సర్టిఫికెట్ సంపాదించారు. బతికున్నప్పుడే చనిపోయినట్టుగా సర్టిఫికెట్ సంపాదించారు. ఆస్తి కోసం ఈ రకంగా వ్యవహరించారని పోలీసుల విచారణలో తేలింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనను అల్లారుముద్దుగా పెంచిన తల్లి చనిపోయిందంటూ డెత్ సర్టిఫికెట్ సంపాదించారు. బతికున్నప్పుడే చనిపోయినట్టుగా సర్టిఫికెట్ సంపాదించారు. ఆస్తి కోసం ఈ రకంగా వ్యవహరించారని పోలీసుల విచారణలో తేలింది.

అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రుల మమకారాన్ని కొడుకులు మరిచిపోతున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తికోసమే అనాగరికంగా, అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. బతికుండగానే తల్లిదండ్రులను చంపేస్తున్నారు.

Hyderabad police arrested Jandhyala Vishnukumar for fake death certificate

బతికుండగానే ఇంటి నుండి స్మశానంలోనో, వృద్దాశ్రమంలో వదిలేసిన ఘటనలు అనేకం చూశాం, విన్నాం. అయితే ఆ తరహా ఘటనలకు ఈ ఘటన చాలా భిన్నం. ఆస్తి కోసం బతికుండగానే తల్లి చనిపోయిందంటూ కొడుకు డెత్ సర్టిఫికెట్ ను తీసుకొచ్చారు.

హైద్రాబాద్ లోని నేరేడ్ మెట్ కు చెందిన ఓ తనయుడు ఈ తతంగాన్ని నడిపాడు. తల్లిదండ్రులుసంపాదించిన ఆస్తిని దక్కించుకోవడం ఆయన ఈ సర్టిఫికెట్ తెచ్చాడని పోలీసులు చెబుతున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకొన్న తల్లి ప్రసూనాంబ పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే పోలీసులు నిందితుడు జంద్యాల విష్ణుకుమార్ ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

English summary
Hyderabad police arrested Jandhyala Vishnukumar for fake death certificate.he created a fake death certificate of his mother Prasunamba.she complaint agaisnt him, police arrested vishnu kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X