హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ వారిని అనుసరించింది, అంతా నిమిషంలోనే: ఆ ఇద్దరు తృటిలో తప్పించుకున్నారు

బంజారాహిల్స్‌లోని పింఛన్ ఆఫీస్ వద్ద మృతి చెందిన మహిళా టెక్కీ శిరీష ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆ ఫుటేజీలను కేసు దర్యాఫ్తు చేస్తున్న అధికారులు గురువారం పరిశీలించారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

టెక్కీ శిరీష ప్రమాదం : సీసీటీవీ ఫుటేజీ | Oneindia Telugu

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని పింఛన్ ఆఫీస్ వద్ద మృతి చెందిన మహిళా టెక్కీ శిరీష ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆ ఫుటేజీలను కేసు దర్యాఫ్తు చేస్తున్న అధికారులు గురువారం పరిశీలించారు.

చదవండి: డ్రైవర్ తొందరపాటు, టెక్కీ చెవిలో ఇయర్ ఫోన్స్: బస్సు చక్రం కిందపడి టెక్కీ శిరీష మృతి

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా

ఆ సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వీడియోల ఆధారంగా ప్రమాదం ఒక్క నిమిషంలోనే జరిగినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఆమె రోడ్డు మలుపు తిరుగుతుండటం, బస్సు హఠాత్తుగా వచ్చి ఆమెను ఢీకొట్టడం అంతా నిమిషంలోనే జరిగిందని గుర్తించారు.

శిరీష ఆ ఇద్దరు యువతులను ఆనుసరించింది

శిరీష ఆ ఇద్దరు యువతులను ఆనుసరించింది

సీసీటీవీ ఫటేజీ ప్రకారం.. శిరీష మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఎక్కి పింఛన్ కార్యాలయం వద్ద దిగారు. ఆమె కంటే ముందు ఇద్దరు యువదులు బస్సు దిగారు. ఆమె కంటే ముందు దిగిన యువతులు రోడ్డు క్రాస్ చేస్తున్నారు. శిరీష కూడా వారిని అనుసరించింది.

బస్సు ముందుకు కదిలింది

బస్సు ముందుకు కదిలింది

ఈ మయంలో ఒక్కసారిగా బస్సు ముందుకు కదిలింది. ఆ బస్సు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికి అక్కడే మృతి చెందారు. కాగా ఆమె దిగిన బస్సే ఢీకొట్టింది.

విచారణలో డ్రైవర్ బాబు

విచారణలో డ్రైవర్ బాబు

బస్సు ప్రమాదంపై డ్రైవర్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ప్రయాణీకులు దిగడం చూశానని, కానీ బస్సు ముందు నుంచి వెళ్తున్నట్లు గుర్తించలేదని చెప్పారు.

శిరీషకు అంత్యక్రియలు

శిరీషకు అంత్యక్రియలు

కాగా, శీరీష సొంతూరు ఖమ్మం జిల్లా కొత్తగూడ ప్రాంతంలోని రుద్రారం గ్రామం. పట్టుదలతో ఎంసీఏ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో స్థిరపడ్డారు. ఆగస్టులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మురళీకృష్ణాచార్యులతో వివాహమైంది. గురువారం గాజులరామారంలో అంత్యక్రియలు చేశారు.

English summary
A 25-year-old techie was killed in a road mishap on Wednesday at Road No 10 at Banjara Hills. The victim was identified as Sirisha, a software employee from the city. According to the police, the mishap occurred when the RTC bus, driven in a rash and negligent manner hit Sirisha as she was crossing the road, following which, she suffered grievous injuries and died on the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X