శ్రీనివాస్ కూచిభొట్ల జయంతి: 'ఎన్నారై పేరెంట్స్' కొవ్వొత్తుల ర్యాలీ
అమెరికాలోని కాన్సాస్లో హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్లకు సంతాపంగా కేబీఆర్ పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిన్న (గురువారం) ఆయన పుట్టిన రోజు.
హైదరాబాద్: అమెరికాలోని కాన్సాస్లో హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్లకు సంతాపంగా తెలంగాణ ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ కేబీఆర్ పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిన్న (గురువారం) ఆయన పుట్టిన రోజు.
వెళ్లిపో అంటూ.. కూచిభొట్ల హత్య: అమెరికాపై తెరాస ఎంపీ నిప్పులు
జాత్యాహంకార కాల్పుల్లో మృతి చెందిన ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయన 33వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం సాయంత్రం వాక్ నిర్వహించారు. ఆయన సతీమణి సునయ కూడా తన భర్తను గుర్తు చేసుకుంటూ ఓ లేఖ రాశారు.
కూచిభొట్ల శ్రీనివాస్
తెలుగు ఇంజనీరు శ్రీనివాస్ కూచిభొట్ల జీవించి న్నట్లయితే గురువారం ఈ రోజు 33వ జన్మదిన వేడుకలను చేసుకని ఉండేవారు. అమెరికాలోని కాన్సాస్లో ఆడమ్ ప్యురింటిన్ జరిపిన కాల్పుల్లో ఆయన మరణించిన విషయం తెలిసిందే.
కూచిభొట్ల
శ్రీనివాస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన భార్య సునయ ఫేస్బుక్లో ఓ లేఖను పోస్టు చేశారు. "హ్యాపీ బర్త్ డే మై లవ్. ఇలా శుభాకాంక్షలు చెబుతున్నందుకు బాధగా ఉంది. నిన్ను చాలా మిస్సవుతున్నా" అంటూ ఆమె పోస్టు పెట్టారు.
శ్రీనివాస్
శ్రీనివాస్ బంధువులు ఇంకా విషాదం నుంచి కోలుకేలేదని అంటున్నారు .శ్రీనివాస్ జీవించి ఉన్నప్పుడు తన పుట్టిన రోజునాడు కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడేవాడని చెబుతున్నారు.
ర్యాలీ
తల్లిదండ్రులు ఆశీర్వాదం కూడా తీసుకునేవాడు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాదులోని కెబిఆర్ పార్కులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.