రక్తపు కూడు తినను, పాపపు పనులు చేయను: కెటిఆర్తో భేటీ తర్వాత దానం
హైదరాబాద్: తాను పార్టీ మారే విషయంలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్. సోమవారం తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావును కాంగ్రెస్ నేత, మాజీమంత్రి దానం నాగేందర్ సోమవారం కలిశారు.
అనంతరం మాట్లాడుతూ.. కేటీఆర్ను తాను వ్యక్తిగత పనుల నిమిత్తమే కలిశానని.. రాజకీయ ప్రాధాన్యత లేదని నాగేందర్ స్పష్టం చేశారు. అయితే దానం నాగేందర్ తన బంధువులకు చెందిన ఓ కంపెనీ విషయం మాట్లాడేందుకు వెళ్లినట్లు సమాచారం.
కేటీఆర్తో భేటీ: ప్రాధాన్యత లేదన్న దానం నాగేందర్
కాగా, కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు గత కొంత కాలంగా కాస్త దూరంగా ఉంటున్న దానం నాగేందర్.. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ కీలక నేత కెటి రామారావును కలవడం చర్చకు దారితీసింది.
ఇది ఇలా ఉంటే.. నయీమ్ ఫామ్ హౌస్ పక్కనే దానం ఫామ్ హౌస్ కూడా ఉండటం, పలు సెటిల్ మెంట్లకు దానం నాగేందర్ సహకరించాడని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఒకప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ నేత కొండపల్లి సీతారామయ్య మరదలు హైమవతికి చెందిన భూమి కబ్జా విషయంలో దానంపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో మంత్రి కెటిఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, ఈ ప్రచారాలపై ఆయన ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ.. 'తాను రక్తపుకూడు తినననీ, ఏపాపం చేయనన్నారు. ఎలాంటి ప్రచారాలకు తాను భయపడే సమస్యేలేదు' అని న్నారు. తనకో వ్యక్తిత్వంఉందనీ, రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేవరకు పోరాడుతానని స్పష్టంచేశారు.
అయితే, కెటిఆర్ను కలిసిన సమయానికే సికింద్రాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ స్థానిక ప్రజా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు జరగుతు న్నాయి. ఏఐసీసీ ప్రతినిధులు హాజరైన కార్యక్ర మానికి ఆయన రాకపోవడంతో ఊహాగానాలకు తావిచ్చినట్లయింది.