వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభ ధూంధాం కాదు: జానా, అక్కడ్నుంచే: రసమయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది. రసమయి మాట్లాడుతుండగా.. జనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసెంబ్లీనా లేక ధూంధాం వేదిక అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

పదే పదే వ్యక్తిగత విమర్శలు ఏమాత్రం సరికాదన్నారు. అనుభవం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడవద్దన్నారు. ఎస్టీలకి రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. దీనిపై రసమయి మాట్లాడుతూ... తాను పుట్టింది, పెరిగింది ధూంధాంలోనేనని, తన పాటైనా, ప్రసంగమైనా ధూంధాంలాగే ఉంటుందన్నారు.

I am from dhoom dhaam: Rasamayi Balakishan

టీడీపీ టీఆర్‌ఎస్‌లో విలీనంపై జగడం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ శాసనమండలి సమావేశాల్లో తెలుగుదేశం పార్టీని, తెరాసలో విలీనం చేయడాన్ని ఇద్దరు న్యాయవాదులు తప్పుపట్టారు. పార్టీ సభ్యులు విలీనమవుతారు తప్ప పార్టీని ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ శాసనమండలిలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అరికెల నర్సారెడ్డి, జంద్యాల రవిశంకర్‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

English summary
I am from dhoom dhaam, says Rasamayi Balakishan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X