నేను మీ ‘పప్పు’లా కాదు: ఆధారాలతో కాంగ్రెస్కు కేటీఆర్ ఘాటు కౌంటర్
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. ఇటీవల, టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో ప్రతి విమర్శలు చేశారు.
'నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు సొంతంగా చేసుకున్నాను. మీ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని కారులో తగలబెట్టలేదు.' అని ఉత్తమ్కు కేటీఆర్ చురకలింటించారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఆర్టికల్తో ఆయన ట్వీట్ చేశారు.
Dear @UttamTPCC Garu, I may have washed dishes in my home in the US (which by the way is what every Indian in US does in their own homes)
— KTR (@KTRTRS) September 8, 2018
I am proud that I’ve worked & earned a decent living on my own unlike your Pappu
Unlike you I didn’t loot people’s money & burn it in my car pic.twitter.com/VXrMeESfCg
కాగా, 2014 ఎన్నికల్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన కారులో రూ.2 కోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇటీవల అమెరికాలో కేటీఆర్ అంట్లూ తోమాడని ఉత్తమ్, రేవంత్ రెడ్డిలు ఎద్దేవా చేస్తూ కేటీఆర్ను విమర్శించిన విషయం తెలిసిందే.
This Gentleman who’s the AICC (aka Delhi Sultanate) incharge says something that only a Scamgress joker can say; Ignorance is bliss
— KTR (@KTRTRS) September 8, 2018
FYI to all, Apple started operations in Hyderabad in August, 2016 & currently employs 3,500 plus people which is their largest centre outside of US pic.twitter.com/w1AzjZDsMl
ఈ నేపథ్యంలో వారి అధినేత రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అలాగే ఆపిల్ కంపెనీ వ్యవహారంలో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా చేసిన వ్యాఖ్యలను మరో ట్వీట్లో కేటీఆర్ తిప్పికొట్టారు.' ఏఐసీసీ జెంటిల్మెన్.. స్కాంగ్రెస్ జోకర్ ఆజ్ఞానంతో మాట్లాడుతున్నారు. 2016లోనే ఆపిల్ కంపెనీ హైదరాబాద్లో తన వ్యవహారాలను ప్రారంభించింది. ప్రస్తుతం 3500 మందికి పైగా ఉద్యోగులతో అమెరికా తర్వాత ఇది అతిపెద్ద సెంటర్గా నిలిచింది' అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలను తిప్పికొట్టారు.