నాకు పబ్బు లేదు, సంయమనం పాటించండి: హీరో తరుణ్
తనకు పబ్బు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని టాలీవుడ్ హీరో తరుణ్ తెలిపారు. ఏడేళ్ల క్రితం తాను ఓ పబ్లో భాగస్వామిగా మాత్రమే ఉండేవాడినని చెప్పారు. ఆరేళ్ల క్రితమే తాను ఆ పబ్ నుంచి పార్ట్
హైదరాబాద్: తనకు పబ్బు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని టాలీవుడ్ హీరో తరుణ్ తెలిపారు. ఏడేళ్ల క్రితం తాను ఓ పబ్లో భాగస్వామిగా మాత్రమే ఉండేవాడినని చెప్పారు. ఆరేళ్ల క్రితమే తాను ఆ పబ్ నుంచి పార్ట్నర్షిప్ వదులుకున్నాని ఆయన తెలిపారు. సిట్ ముందు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు.
సంబంధం లేదు..
సిట్ అధికారుల విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. డ్రగ్స్ మాఫియాతో తనకు సంబంధం లేదని తరుణ్ స్పష్టం చేశారు. సిట్ విచారణ అనంతరం తాను అన్ని వివరాలు చెబుతానని తరుణ్ చెప్పారు.
సంయమనం పాటించండి..
దయచేసి సంయమనం పాటించాలని ఆయన కోరారు. నా నిజాయితీని సిట్ ముందు నిరూపించుకుంటానని తరుణ్ తెలిపారు. డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న నేపథ్యంలో ఆయన శనివారం ఉదయం సిట్ విచారణకు హాజరయ్యారు. 2009లో ఆన్ అనే పబ్బును ప్రారంభించారు తరుణ్.
Recommended Video
కీలక సమాచారం రాబట్టే అవకాశం
కాగా, ఇప్పటికే పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజులను విచారించిన సిట్ అధికారులు శనివారం తరుణ్ను విచారిస్తున్నారు. శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తరుణ్ నుంచి కూడా కేసు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది.
ఏం చెబుతారో..
సిట్ విచారణలో తరుణ్ ఏం చెబుతారనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజులు డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో తరుణ్ ఏం చెబుతారనేది ఉత్కంఠకు గురిచేస్తోంది.