రాష్ట్రానికి ఆర్థిక మంత్రి , ఇంట్లో మాత్రం ఆయన భార్యదే పెత్తనం
తెలంగాణ ఆర్తికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వరుసగా నాలుగోసారి సోమవారం నాడు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.అయితే రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయినప్పటికీ ఆయన ఇంటి ఆర్థిక వ్యవహరాలను మాత్రం ఆయన సతీమణి జమున పర్యవేక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఈటెల రాజేందర్ ఆర్థికశాఖ మంత్రి.అయితే ఈటెల ఇంట్లో మాత్రం ఆయన సతీమణి జమున మాత్రమే ఇంటి ఆర్థిక వ్యవహరాలను పరిశీలిస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి అయితే తన ఇంట్లో మాత్రం ఆయన భార్య జమునే ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం, ఈటెల కుటుంబానికి సంబందించిన ఆర్థిక వ్యవహరాలన్నీ జమునే నిర్వహిస్తారు.
మంత్రిగా ఈటెల రాజేందర్ నిత్యం బిజీగా ఉంటారు. మంత్రి కాకముందు ఉద్యమ సమయంలో కూడ ఆయన నిత్యం బిజీగా ఉండేవాడు.,అయితే దీంతో ఇంటికి అవసరమైన ఆర్థిక వ్యవహరాలన్నీ ఆమె చూసుకొనేవారు.దీంతో ఈటెల రాష్ట్రానికి కావాల్సిన అవసరాలకు సంబందించిన వ్యవహరాలను చూసే పనిలో బిజీగా ఉంటారు.అయితే తన ఇంటి ఆర్థిక అవసరాలను జమున చూస్తారు.
ఈటెల కుటుంబానికి పౌల్ట్రీ వ్యాపారాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి రాకముందు ఈటెల రాజేందర్ ఈ వ్యాపారాన్ని తానే నిర్వహించేవారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహరాలన్నీ ఈటెల సతీమణి జమున చూస్తారు. దీంతో పౌల్ట్రీకి అవసరమైన ఆర్థిక అవసరాలను ఆమె చూష్తారు.
తన కుటుంబ ఆర్థిక అవసరాల గురించి ఈటెల ఇబ్బంది పడడు. తన భార్య జమునే ఈ వ్యవహరాలను చూస్తున్నందున ఆయనకు ఇబ్బందులు లేవని ఈటెల కూడ తన సన్నిహితుల వద్ద చెబుతుంటారు.
మరో వైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరుసగా నాలుగోసారి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ను సోమవారం నాడు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందుకు ఈటెల సతీమణి జమున మీడియా ప్రతినిథులతో చిట్ చేశారు.