కేటీఆర్ బచ్చానా అయితే రాహుల్ ఏంటీ: ఉత్తమ్కు కర్నె, జీవన్రెడ్డి కౌంటర్
హుజూర్నగర్ ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది. నేతల మాటల మంటలతో బై పోల్ పీక్కి చేరింది. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య వాగ్యుద్ధం తారాస్థాయికి చేరింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి బచ్చా అనడంతో మాటల యుద్ధం మరింత ముదిరింది. కేటీఆర్ బచ్చా అయితే మరి రాహుల్ ఏంటీ అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ మేం అలా నిందించబోమని, తమకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అలా నేర్పించలేదన్నారు. క్రమశిక్షణగా ఎలా మెలగాలో చెప్పారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ నేతల సవాల్
హుజూర్నగర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని టీఆర్ఎస్ నేతలు కర్నె ప్రభాకర్, జీవన్రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల కేటీఆర్ బచ్చా అని ఉత్తమ్కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. దీనిని టీఆర్ఎస్ నేతలు ఖండించారు. రాజకీయాల్లో కావాల్సింది సంస్కారం అని టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. కేటీఆర్ వయస్సు 43 ఏళ్లు అని రాహుల్ ఏజ్ ఏంత అని ప్రశ్నించారు. అటు ఇటుగా 45 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. మరీ కేటీఆర్ బచ్చా అని అంటే మరీ రాహుల్ ఏంటీ అని నిలదీశారు.
బుల్లెట్ దిగిందా లేదా
ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదన్నారు మరో నేత ఆశన్నగారి జీవన్రెడ్డి. 16 ఏళ్ల ఉద్యమంలో కేటీఆర్ చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంలో కీ రోల్ పోషించారని చెప్పారు. 99 సీట్లు గెలిచి కార్పొరేషన్ మీద గులాబీ జెండా రెపరెపలు ఆడించడంలో ముఖ్యభూమిక పోషించారని తెలిపారు. అలాంటి నేతను బచ్చా అంటారా అని జీవన్రెడ్డి ఫైరయ్యారు. మేం కూడా మిమ్మల్ని లుచ్చా అని అనొచ్చు.. కానీ మాకు కేసీఆర్ సంస్కారం నేర్పించారని పేర్కొన్నారు.
వేర్ ఈజ్ డిసిప్లేన్
ఆర్మీలో పనిచేసిన ఉత్తమ్ ఏం క్రమశిక్షణ నేర్చుకున్నారని మండిపడ్డారు. ఆర్మీలో పనిచేసి ఇలానేనా మాట్లాడేది అని ప్రశ్నించారు. కుటుంబపాలన అని మమ్మల్ని అంటున్నారు.. కాంగ్రెస్ పార్టీ నేపథ్యం ఏంటి నిలదీశారు. రాష్ట్రంలో అసెంబ్లీకి ఉత్తమ్, పద్మావతి ఇద్దరు పోటీచేశారు కదా అని గుర్తుచేశారు. పార్లమెంట్కు ఉత్తమ్ బరిలోకి దిగారు. ఇప్పుడు హుజూర్నగర్లో మళ్లీ పద్మావతి బరిలోకి దిగారు. ఇక్కడ ఓడిపోయి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఉత్తమ్ కుటుంబం పోటీ చేస్తుంది కావచ్చు అని సెటైర్లు విసిరారు.
రాచరిక పాలనకు నిలువుటద్దం
కాంగ్రెస్ పార్టీలో కుటుంబపాలన లేదా అని ఆశన్నగారి జీవన్ రెడ్డి నిలదీశారు. గాంధీ-నెహ్రూ వారసులమని చెపుతూ ఆ కుటుంబమే అధ్యక్ష పగ్గాలు, అధికారం చేపట్టడం లేదా అని ప్రశ్నించారు. కేంద్రంలో సోనియా-రాహుల్.. రాష్ట్రంలో ఉత్తమ్ కుటుంబం కుటుంబపాలనకు నిదర్శమన్నారు. ముందు మీరు ఇల్లు సరిచూసుకొని.. తమ గురించి ప్రశ్నించాలని సూచించారు.