కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవారు దేశద్రోహులుగా అభివర్ణించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని పాకిస్తాన్ పంపించాలని కోరారు. అదీ కూడా బ్రేకుల్లేని బస్సులో పంపించాలని బండి సంజయ్ అన్నారు. సీఏఏను వ్యతిరేకించడం అంటే దేశంలో ఉంటూ ద్రోహం చేయడమేనని గుర్తుచేశారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏను నిరసిస్తూ ఆందోళనకారులు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన ఆందోళనలు ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, బెంగళూర్‌కి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గత వారం ట్యాంక్‌బండ్‌పై దాదాపు 25 వేల మంది ముస్లింలు ర్యాలీ కూడా తీశారు.

if you take stone, will take bomb: mp bandi sanjay

సీఏఏకు అనుకూలంగా బీజేపీ ర్యాలీ నిర్వహిస్తుండగా.. వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఎంపీ బండి సంజయ్ స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు దేశద్రోహులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులు రాళ్లు పట్టుకుంటే.. మేం బాంబులు పడతామని బండి సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపే అవకాశం ఉన్నది.

English summary
if you take stone, will take bomb karimnagar mp bandi sanjay hot comments
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X