ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు, అంతకుముందే మరో మహిళతో వివాహేతర సంబంధం తర్వాత ఏం జరిగింది
పెళ్ళికి ముందే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయమై భార్య, భర్తల మద్య జరిగిన గొడవ భర్త ఆత్మహత్యకు కారణమైంది.
హైదరాబాద్ :ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు. అయితే అంతకుమందే మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధం కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకొనేంత పనిచేసింది. వివాహేతర సంబంధం భార్య,భర్తల మధ్య అగాధాన్ని పెంచింది. ఈ కారణంగానే భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.
ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని స్వర్ణ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ స్పెషల్ ప్రోటెక్షన్ ఫోర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. కొండాపూర్ లోని 8వ, బెటాలియన్ లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన 2011 లో బూసమ్మ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకొన్నాడు.
బూసమ్మతో వివాహనికి ముందే ఆయనకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. అయితే ఈ విషయంలో పెద్దలు వారికి రాజీ కుదిర్చారు. బూసమ్మతో వివాహం తర్వాత వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు పుట్టారు.బూసమ్మ పుట్టింటి నుండి వారం రోజుల క్రితమే భర్త వద్దకు వచ్చింది.
విజయ్ కుమార్ తో భార్య మంగళవారం రాత్రి గొడవపడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ గొడవకు విజయ్ కుమార్ కు గతంలో ఉన్న మహిళతో వివాహేతర సంబంధం కారణమని తెలుస్తోంది. ఈ కారణంగానే వారిద్దరి గొడవ పడడంతో విజయ్ కుమార్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడని గచ్చిబౌలి ఎస్ ఐ రామయ్య తెలిపాడు.