వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భర్తను నడిరోడ్డులో చితకబాదిన భార్య
వనపర్తి :వివాహేతర సంబంధం కొనసాగిస్తోన్న భర్తకు ఓ మహిళ దేహశుద్ది చేసింది. పెద్దలు,పోలీసు సమక్షంలోనే ఆయన తప్పును ఎత్తిచూపింది. పిల్లలకు దిక్కేవరూ అంటూ ఆమె ప్రశ్నించింది.ఈ ప్రశ్నలకు భర్త సమాధానం చెప్పలేకపోయాడు.
వనపర్తి కి చెందిన లక్ష్మీకి ఘనపురం మండలం ఉప్పరపల్లికి చెందిన ఆంజనేయులుతో 16 ఏళ్ళ క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు ఆంజనేయులు.
లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు. ఆంజనేయులు మద్యానికి బానిస అయ్యాడు. మరో మహిళతో ఆంజనేయులు వివాహేతర సంబంధ: కొనసాగిస్తున్నాడు. ఈ సంబంధం కారణంగా భార్య లక్ష్మీని చిత్రహింసలు పెట్టేవాడు.
లక్ష్మీ పుట్టింటి వారు సర్థిచెప్పారు. ఆర్థిక సమస్యల కారణంగానే ఆంజనేయులు ఈ రకంగా మారాడని భావించారు. ఆంజనేయులుకు లారీని కొనుగోలు చేసి ఇచ్చారు.
భర్త వేధింపులు భరించలేక పుట్టింట్లోనే ఉంటున్న లక్ష్మీని బాగా చూసుకొంటానని ఆంజనేయులు తన ఇంటికి తీసుకువచ్చాడు.
అయినా ఆయన ప్రవర్తనలో మార్పురాలేదు. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ ఇంటి వద్దకు
పోలీసులు, పెద్దలతో వెళ్ళి భర్త ఆంజనేయులును చితకబాదింది. పిల్లలకు దిక్కెవరూ అంటూ ప్రశ్నించింది. భర్తను నడిరోడ్డులోనే చితకబాదింది.