వదినతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.. చివరికి..!
ఏటూరు నాగారం : దారితప్పే మానవ సంబంధాలు చివరికి హత్యలతో అంతమవుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని ఆకులవారి గణపురంలో వివాహేతర సంబంధం కారణంగా ఓ దారుణ హత్య చోటు చేసుకుంది. తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతొ సమ్మయ్య అనే ఓ వ్యక్తి తనకు కొడుకు వరుసయ్యే యువకుడిని కిరాతకంగా చంపేశాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఆకులవారి గణపురానికి చెందిన కేతిరి రమేశ్ (23) అనే యువుకుడు గత కొంతకాలంగా తన వదినతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలిసిన ఆమె మామ కేతిరి సమ్మయ్య (55) రమేశ్ పై ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా రమేశ్ ని హతం చేయాలనుకున్న సమ్మయ్య గ్రామంలోని చెరువు సమీపంలో రమేశ్ ని గొడ్డలితో నరికి హత్య చేశాడు.
హత్య తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో సమ్మయ్య లొంగిపోగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యానంతరం మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.