నష్టపరిహారం చెల్లింపుల్లో వేగం పెంచండి..! మల్లన్న సాగర్ పై సీఎం సమీక్ష..!!
Recommended Video
హైదరాబాద్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు సహాయ, పునరావాసంపై తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వాలని, సహాయ పునరావాస చర్యలు చేపట్టాలంటూ ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో సీఎం ఈ అంశంపై మరోసారి సమీక్షించారు.
ఇప్పటికే యుద్ధప్రాతిపదికన పరిహార చెల్లింపు పనులు చేపట్టాలని, ఈ రోజు నాటికి (మే 11) ఈఅంశంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ సీఎం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 15న మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వ్యవహారం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అధికారులతో సమీక్షిస్తున్నారు.
ఆ ముగ్గురు ఎవరు ? ఎవరినీ వరించెనో ఎమ్మెల్సీ పదవీ : కేసీఆర్లో మదిలో ఏముంది ?
అయితే, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కోసం అధికారులు ఆయా గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటుచేసి పరిహారం చెల్లింపును పూర్తిచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చెక్కుల పంపిణీ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఏయే గ్రామాల్లో ఎంతమంది నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు? ఎంత మొత్తంలో పంపిణీ చేశారు?
ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నారా? తదితర అంశాలను సీఎం అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ ఎస్కే జోసీతో పాటు సోమేశ్కుమార్, స్మితా సబర్వాల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, పరిహారం పంపిణీని పూర్తిస్థాయిలో పర్యవేక్షించిన కొందరు అధికారులు పాల్గొన్నారు.