పార్టీ కార్యాలయాల్లో జెండా పండుగ, జాతీయ పతాకం ఆవిష్కరించిన నేతలు
హైదరాబాద్ : బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలుగడంతో ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సారి కూడా గోల్కొండ కోట వేడుకకు సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం కేసీఆర్ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోట పరిసరాల్లో భారీ భద్రతను మొహరించారు. జాగీలాలతో అణువణువూ పరిశీలిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జెండా పండుగ వేదికను ప్రభుత్వం మార్చారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను .. గోల్కొండ కోటకు మార్చారు. 2014 నుంచి వరుసగా గోల్కొండ కోటలోనే జెండాను సీఎం ఆవిష్కరిస్తున్నారు. వరుసగా ఆరోసారి గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ మువ్వన్నెల జెండ ఎగరేయన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. గోల్కొండ కోటలో నిర్వహించే జెండా పండుగ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. జెండా వందనం, సీఎం కాన్వాయ్ కోసం పోలీసు బలగాలు రిహార్సల్స్ నిర్వహించారు.