తప్పిన పెను ప్రమాదం: శంషాబాద్లో 15 ని.లపాటు ఇండిగో విమానం చక్కర్లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్: మరో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఢిల్లీకి వెళ్లాల్సిన ఆ విమానం 15 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
అయితే, సమస్యను పసిగట్టిన ఫైలెట్ ఎమర్జెన్సీ ల్యాండిగ్కు అనుమతి తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్టులోనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు.
శంషాబాద్: పేలిన ఇండిగో విమానం టైరు, మంటలు, విమానంలోనే రోజా
గత కొంతకాలంగా ఇండిగో ఫ్లైట్లు సాంకేతిక సమస్యలతో సతమతమౌతున్నాయి. సరిగ్గా రెండు రోజల క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్టులోనే ఇదే కంపెనీకి చెందిన విమానం టైర్లు పేలిపోయి మంటలు చెలరేగాయి.
అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. కాగా, ఈ విమానంలోనే వందమందికిపైగా ప్రయాణికులతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు.
ఈ సంఘటన మరిచిపోక ముందే ఇండిగోకే చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీటిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. ఇండిగో ప్రయాణం అంటే ప్రాణానికి భరోసా లేదంటూ మండిపడుతున్నారు.