హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పిన పెను ప్రమాదం: శంషాబాద్‌లో 15 ని.లపాటు ఇండిగో విమానం చక్కర్లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మరో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్‌ నుంచి టేకాఫ్‌ తీసుకున్న కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఢిల్లీకి వెళ్లాల్సిన ఆ విమానం 15 నిమిషాలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.

అయితే, సమస్యను పసిగట్టిన ఫైలెట్‌ ఎమర్జెన్సీ ల్యాండిగ్‌కు అనుమతి తీసుకొని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే విమానాన్ని ల్యాండ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు.

శంషాబాద్: పేలిన ఇండిగో విమానం టైరు, మంటలు, విమానంలోనే రోజా శంషాబాద్: పేలిన ఇండిగో విమానం టైరు, మంటలు, విమానంలోనే రోజా

గత కొంతకాలంగా ఇండిగో ఫ్లైట్లు సాంకేతిక సమస్యలతో సతమతమౌతున్నాయి. సరిగ్గా రెండు రోజల క్రితమే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోనే ఇదే కంపెనీకి చెందిన విమానం టైర్లు పేలిపోయి మంటలు చెలరేగాయి.

 A indigo flight emergency landing shamshabad due to Technical defect

అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. కాగా, ఈ విమానంలోనే వందమందికిపైగా ప్రయాణికులతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు.

ఈ సంఘటన మరిచిపోక ముందే ఇండిగోకే చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీటిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. ఇండిగో ప్రయాణం అంటే ప్రాణానికి భరోసా లేదంటూ మండిపడుతున్నారు.

English summary
A Indigo flight on Friday emergency landed Shamshabad due to Technical defect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X