వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు..? 20న ఫస్టియర్ రిజల్ట్స్...: ఇంటర్ బోర్డు

|
Google Oneindia TeluguNews

ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఫలితాల వెల్లడికి మిగతా ప్రాసెస్ కూడా బోర్డు పూర్తిచేస్తోంది. ఈ నెల 15వ తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేస్తామని సంకేతాలు ఇచ్చింది. 20వ తేదీన ఫస్టియర్ ఫలితాలను విడుదల చేస్తామని ఇండికేషన్ ఇచ్చింది. ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ జిల్లాల్లో.. హైదరాబాద్‌లో కూడా పూర్తవడంతో ఫలితాల వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది.ఈ సారి ఫలితాలను తప్పులకు ఆస్కారం లేకుండా విడుదల చేయాలని భావిస్తోంది. అందుకోసం ఒకటి రెండురోజులు ఆలస్యమైనా ఫరవాలేదు అని.. తప్పులు లేకుండా రిలీజ్ చేస్తామంటోంది.

 తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జూన్ 3న: కళాశాలల ప్రారంభంపై బోర్డు క్లారిటీ తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జూన్ 3న: కళాశాలల ప్రారంభంపై బోర్డు క్లారిటీ

లాక్ డౌన్ వల్ల మార్చి 23వ తేదీన జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షలను ఈ నెల 3వ తేదీన నిర్వహిస్తున్నారు. ఆ పరీక్ష పూర్తయిన తర్వాత.. వాల్యూయేషన్ చేసి... మరోసారి క్రాస్ చేసుకుంటామని చెబుతున్నారు. గతేడాది ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా మారింది. ఎప్పుడూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను కాదని గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగించారు.

inter second year results will be announe june 15th..

Recommended Video

Hyderabad Sudarshan 35MM Theatre Getting Ready With New Seating System

దీంతో ఫలితాలు తారుమారై.... 18 మంది పైచిలుకు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశం రాష్ట్రంలో దుమారం రేపింది. తర్వాత ప్రభుత్వం కమిటీ వేసి.. చేతలు దులుపుకుంది. కానీ ఈసారి అలాంటి తప్పులు లేకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.

English summary
inter second year exam results will be announe june 15th board officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X