15న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు..? 20న ఫస్టియర్ రిజల్ట్స్...: ఇంటర్ బోర్డు
ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ఫలితాల వెల్లడికి మిగతా ప్రాసెస్ కూడా బోర్డు పూర్తిచేస్తోంది. ఈ నెల 15వ తేదీన ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేస్తామని సంకేతాలు ఇచ్చింది. 20వ తేదీన ఫస్టియర్ ఫలితాలను విడుదల చేస్తామని ఇండికేషన్ ఇచ్చింది. ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ జిల్లాల్లో.. హైదరాబాద్లో కూడా పూర్తవడంతో ఫలితాల వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది.ఈ సారి ఫలితాలను తప్పులకు ఆస్కారం లేకుండా విడుదల చేయాలని భావిస్తోంది. అందుకోసం ఒకటి రెండురోజులు ఆలస్యమైనా ఫరవాలేదు అని.. తప్పులు లేకుండా రిలీజ్ చేస్తామంటోంది.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జూన్ 3న: కళాశాలల ప్రారంభంపై బోర్డు క్లారిటీ
లాక్ డౌన్ వల్ల మార్చి 23వ తేదీన జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్ పరీక్షలను ఈ నెల 3వ తేదీన నిర్వహిస్తున్నారు. ఆ పరీక్ష పూర్తయిన తర్వాత.. వాల్యూయేషన్ చేసి... మరోసారి క్రాస్ చేసుకుంటామని చెబుతున్నారు. గతేడాది ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా మారింది. ఎప్పుడూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ను కాదని గ్లోబరీనా సంస్థకు బాధ్యతలు అప్పగించారు.
Recommended Video
దీంతో ఫలితాలు తారుమారై.... 18 మంది పైచిలుకు మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశం రాష్ట్రంలో దుమారం రేపింది. తర్వాత ప్రభుత్వం కమిటీ వేసి.. చేతలు దులుపుకుంది. కానీ ఈసారి అలాంటి తప్పులు లేకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.