వైభవంగా కూతురు పెళ్లి: గాలి జనార్ధన్ రెడ్డిని సాయి కుమార్ అప్సెట్ చేశారా?
ప్రముఖ నటుడు సాయి కుమార్ కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డిని అప్ సెట్ చేశారా? అంటే అవుననే ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది.
హైదరాబాద్: ప్రముఖ నటుడు సాయి కుమార్ కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డిని అప్ సెట్ చేశారా? అంటే అవుననే ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది. గాలి ఈ నటుడి విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారట.
గాలి జనార్ధన్ రెడ్డి కూతురు బ్రాహ్మిణి వివాహం ఇటీవల బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి రూ.వందల కోట్లు ఖర్చు చేశారని అంటున్నారు. తాను కోరుకున్న విధంగా తన కుమార్తె పెళ్లి చేశానన్న సంతోషం ఉన్నప్పటికీ.. ఓ విషయంలో మాత్రం ఆయన కోపంతో ఉన్నారట!
వివాహానికి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు పెద్దగా రాకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారట. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులను పెద్ద సంఖ్యలో పెళ్లికి ఆహ్వానించారు. అంతేకాదు, వారందరినీ పెళ్లికి తీసుకురావాల్సిన బాధ్యతను సాయి కుమార్ పైన ఉంచారని చెబుతున్నారు.
కానీ సినీ ప్రముఖులను తీసుకు వెళ్లడంలో వీరిద్దరు ఫెయిల్ అయ్యారని, అందుకే గాలి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పెళ్లికి ముందు జరిగిన సంగీత్ కార్యక్రమానికి రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, సుమన్, బ్రహ్మానందం వంటి వారు కొంత మంది హాజరయ్యారు. ఇదిలా ఉండగా, హైదరాబాదులో జరిగే రిసెప్షన్కు పెద్ద స్టార్లను తీసుకొస్తానని సాయి కుమార్ మాట ఇచ్చారని కూడా ప్రచారం సాగుతోంది.