పంచాయితి డిపాజిట్ ల కోసం ,''ఓ స్త్రీ రేపు రా'' అంటున్న అధికారులు
రాష్ట్ర ప్ఱభుత్వ ఖజాన మరి దారుణ పరిస్థితుల్లో ఉందా ? డిపాజిట్ డబ్బులు తిరిగి ఇచ్చేందుకు స్థానిక అధికారులు గేమ్స్ అడుతున్నారా,అందుకే ఓడిన అభ్యర్థులను ముప్పు తిప్పలు పెడుతున్నారా.. పంచాయితీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులకు డిపాజిట్ లు తిరిగి చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అలసత్వం వహిస్తున్నారు.దీంతో వచ్చే అతి తక్కువ అమౌంట్ కోసం అభ్యర్థులు రోజుల తరబడి ఆఫీసుల చుట్టు తిరుగుతున్నారు.
కేటీఆర్ భీమవరం లో పోటీ చేయ్: బాబు రిటైరవ్వాలి: జగన్ కు మద్దతా: పవన్
అసలే సర్పంచ్ పదవి..కాస్తో కూస్తో ఉళ్లో పరువుతోపాటు కాసిన్ని డ్బబ్బులు సంపాదించుకుంటామనే ఆశతో గ్రామల్లో జరిగే సర్పంచి పదవులు , చిన్నా పెద్ద తేడా లేకుండా పోటిలో ఉంటారు..కాస్త ప్రజాబలం ఉంటే చాలు డిపాజిట్ రెండు వేల కదా, అంటు ఓక్కో స్దానానికి పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు..అయితే చివరకు సర్పంచ్ పదవి రాకపోగ ఖర్చుల కోసం అప్పులు కడుతున్నవారు రాష్ట్రంలో కోకొల్లలు ఉన్నారు..
దీంతో ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయిన అభ్యర్థుల పరిస్థితి మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్టుగా తయారైంది.తెలంగాణ జిల్లాలోని చాల జిల్లాల్లో ఇచ్చిన డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఓ స్త్రీ రేపు రా అనే సమాధానం చెబుతున్నారు స్థానిక జిల్లాల పంచాయితీ అధికారులు, దీంతో చాల జిల్లాలో కనీసం 30 శాతం మందికి డబ్బులు చెల్లించాలని చెబుతున్నారు..అయితే కొన్ని చోట్ల డబ్బులు వచ్చినా వాటిని ప్రస్థుత ఎన్నికల ఖర్చుల కోసం వాడుకున్నామని చెబుతున్నారు.