ఇవాంక ధన్యవాద్: థ్యాంక్స్ చెబుతూ ట్వీట్
హైదరాబాద్: హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.
జీఈఎస్ సదస్సులో పాల్గొనడం తాను గర్వకారణంగా భావిస్తున్నట్లు ఇవాంకా తెలిపారు. హైదరాబాద్లో రెండు వారాల క్రితం జరిగిన జిఈఎస్పై మంగళవారం ఇవాంకా ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన బృందం ఇవాంకా నేతృత్వంలో సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే.
ఇవాంక చేసిన ట్వీట్ను దాదాపు 1500 మంది భారతీయులు, ఆరువేల మంది విదేశీయులు షేర్ చేశారు. మరో 900 మంది ఆ ట్వీట్ను రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇవాంకా సదస్సు నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ హిందీ పదం ధన్యవాద్ అని వాడడం విశేషం. ఆ పదాన్ని ఆమె హిందీలోనే రాశారు.
జీఈఎస్ సదస్సులో సుమారు 1200 మంది చురుకైన పారిశ్రామికవేత్తలతో సహా తమ దేశానికి చెందిన 350 మంది పాల్గొన్నట్లు ఇవాంకా ఆ ట్వీట్లో తెలిపారు. అద్భుతమైన ఆహ్వానం ఇచ్చిన ప్రధాని మోడీకి, భారత దేశ ప్రజలకు థ్యాంక్స్ అంటూ ఆమె ట్వీట్ చేశారు