సెంట్రల్ జైలులో నిద్రమత్తులో ఉన్న వార్డర్ ..ఏం జరిగిందంటే
విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న జైలు వార్డర్ రామును వరంగల్ సెంట్రల్ జైలు సూపరింటెండ్ సంతప్ సస్సెండ్ చేశారు.విధలను నిర్లక్ష్యం చేస్తూ నిద్రపోతున్న రాముపై జైలు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
వరంగల్ :నేరాలు, దొంగతనాలు, దోపిడిలు, హత్యలకు పాల్పడిన వారికి శిక్షలు అనుభిస్తోన్న జైలులో నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తోన్న వార్డర్ ను సస్పెన్షన్ గురయ్యాడు.విధులను వదిలేసి నిద్రలో మునిగిపోయాడు ఉన్నతాధికారులు వచ్చినా ఆయన తన మత్తును వీడలేదు. దీంతో ఆయనను విధుల నుండి సస్సెండ్ చేశారు.
జైలులో విధులు నిర్వహించే సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలి. కాని, ఓ జైలు వార్డర్ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తుండడాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. వెంటనే అతన్ని విధుల నుండి తప్పించారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహించే వారికి ఇదే రకమైన శిక్షలు ఉంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
వరంగల్ సెంట్రల్ జైలులో విధులు నిర్వహిస్తున్న రాము అనే వార్డర్ విధులను నిర్లక్ష్యం చేస్తూ సస్పెన్షన్ కు గురయ్యారు. సోమవారం నాడు మధ్యాహ్నం పూట విధుల్లో ఉండి కూడ నిద్ర పోయారు రాము. రౌండ్లకు ఉన్నతాధికారులు వస్తారనే విషయాన్ని కూడ ఆయన మరిచిపోయారు.
విధులను నిర్లక్ష్యం చేస్తూ నిద్రలో తూగుతున్న రామును జైలు సూపరింటెండ్ సంపత్ చూశారు.వార్డర్ పై సస్పెన్ వేటు వేసినట్టు తెలిసింది. జైలులో విధులు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా లేకపోతే అనర్థాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉందని ఉన్నతాధికారలుు అభిప్రాయపడుతున్నారు.