సరిహద్దు ప్రాంతాల్లో పేలిన మందుపాతర: పోలీసు మృతి
భూపాలపల్లి: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 18 మంది పోలీసులకు తీవ్రగాయాలపాలయ్యారు. కాగా, ఒకరు మృతి చెందినట్లు సమాచారం. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా పరిధిలో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలిసింది.
ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలైనట్లు తెలిసింది. ఈ క్రమంలో బుధవారం పోలీసు బలగాలు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో గాలింపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన సీ 60 కమెండోలు 19 మంది బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో గడ్చిరోలి జిల్లా బాంబ్రిఘడ్ తాలూకా పరిధిలో సంచరిస్తుండగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
18 మంది పోలీసులు గాయపడగా, సురేష్ అనే కమాండో మృతి చెందినట్లు సమాచారం. దీపక్, ప్రకాష్, జితేందర్ కొర్తెతోపాటు పలువురు గాయపడ్డారు. ఈ సంఘటనలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో అలజడి మొదలైంది. దీంతో తెలంగాణ ప్రాంత పోలీసులు ముందస్తు భద్రత చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దు గ్రామాలు, అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబీంగ్లు నిర్వహిస్తున్నారు.