వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియో మరో సంచలనానికి సిద్ధం: రూ.500లకే 4జీ ఫోన్

భారతీయ టెలికాం మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో మరో సంచలనానికి నాంది పలకనుంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ టెలికాం మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియో మరో సంచలనానికి నాంది పలకనుంది. ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాలింగ్ సేవలతో టెలికాం దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన జియో తాజాగా ఫీచర్ ఫోన్లను తీసుకు రానుంది.

ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న వీఎల్‌టీఈ సదుపాయం కలిగిన ఫీచర్‌ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. అదీ ఈ నెలలోనే విడుదల చేయనుందని తెలుస్తోంది.

jio-feature-phone-launch-with-rs-500-price-tag-on-july-21

దీనిని కేవలం రూ.500కే అందించాలని జియో యోచిస్తోంది. ఈ నెల 21న కంపెనీ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో కొత్త ఫోన్‌ విషయాలను వెల్లడించే అవకాశముంది.

2జీ సబ్ స్క్రైబర్లను 4జీకి మార్చేందుకు గాను జియో.. సబ్సిడీపై ఈ ఫోన్లను అందించనుందని చెబుతున్నారు. దీంతో పాటు ధన్‌ ధనాధన్‌ ఆఫర్‌కు కొనసాగింపుగా మరో ప్రమోషనల్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ధర రూ.1500 వరకు ఉంటుందని చాలామంది భావించారు. కానీ రూ.500కే అందించనుందని తెలుస్తోంది.

English summary
The long-rumoured Jio feature phone with 4G VoLTE support may be unveiled at a price of Rs. 500 on July 21, the day Reliance Industries Limited is holding its Annual General Meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X