వామపక్షాలతో చేతులు కలిపిన జెపి: విన్ హైదరాబాద్ అంటూ ప్రచారం(పిక్చర్స్)
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో లోకసత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వామపక్ష పార్టీలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. లోక్సత్తా, వామపక్షాల కూటమిని గెలిపించాలని ఆ పార్టీల నేతలు ఓటర్లను కోరారు.
బుధవారం ఇందిరాపార్కు వద్ద వన్ హైదరాబాద్-విన్ హైదరాబాద్ నినాదంతో లోక్సత్తా, సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యు) పార్టీలు ఎన్నికల బహిరంగసభను నిర్వహించాయి. ఈ సందర్భంగా లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా నగర ప్రజలు నీతిమంతమైన కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. అధికారం, ధనంతో ఎన్నికలు గెలవాలనే కుతంత్రాలు చేస్తున్న టిఆర్ఎస్ను ఓడించాల్సిన బాధ్యత పౌరులపై ఉందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ఓటర్లు కాదు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు అమ్ముడుపోతుండటం దుర్మార్గమన్నారు.
జెపి ప్రచారం
జిహెచ్ఎంసి ఎన్నికల్లో లోక్సత్తా, వామపక్షాల కూటమిని గెలిపించాలని ఆయా పార్టీల తలు ఓటర్లను కోరారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద వన్ హైదరాబాద్-విన్ హైదరాబాద్ నినాదంతో లోక్సత్తా, సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యు) పార్టీలు ఎన్నికల బహిరంగసభను నిర్వహించాయి.
వన్ హైదరాబాద్ ప్రచారం
ఈ సందర్భంగా లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా నగర ప్రజలు నీతిమంతమైన కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.
వన్ హైదరాబాద్ ప్రచారం
ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ గౌస్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ మాఫియా పార్టీగా మారిపోయిందని ఆరోపించారు.
వన్ హైదరాబాద్ ప్రచారం
సభలో మాజీ ఎంపీ అజీజ్పాషా, డా.సుధాకర్, డీజీ నరసింహారావు, శ్రీనివాస్రెడ్డి, బాలమల్లేశ్, వెంకట్, పాండురంగారావు, సోల్కర్, వనం సుధాకర్తో పాటు వన్ హైదరాబాద్ కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు.