సమ్మె విరమించే ప్రసక్తే లేదు: జూడాలు (ఫోటోలు)
హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్, ఆదిత్యా, ఇమ్రాన్లు మీడియాతో మాట్లాడారు.
తాము చేస్తున్న పోరాటం న్యాయమైందని, తమ వెనుక ఎలాంటి కార్పోరేట్ శక్తులు లేవని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియాలో ఎక్కడా పేర్కొనలేదని అన్నారు. కోర్టు తీర్పువచ్చిన అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ వైద్యం ప్రవేట్ పరం కావడం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రజా మద్దతు లేని నిరసన వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని.. పేద రోగులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇది ఇలా ఉంటే నెలరోజులుగా విధులను బహిస్కరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను డీబార్ చేస్తామని గాంధీ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆదివారం హెచ్చరించింది. దీనికి సంబంధించి తమ కళాశాలలో చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి వారి తల్లితండ్రులకు నోటీసులు జారీ చేసింది.
సమ్మే ఆపేది లేదంటున్న జూడాలు
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్, ఆదిత్యా, ఇమ్రాన్లు మీడియాతో మాట్లాడారు.
సమ్మే ఆపేది లేదంటున్న జూడాలు
తాము చేస్తున్న పోరాటం న్యాయమైందని, తమ వెనుక ఎలాంటి కార్పోరేట్ శక్తులు లేవని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని మెడికల్ కౌన్సిల్ ఆప్ ఇండియాలో ఎక్కడా పేర్కొనలేదని అన్నారు. కోర్టు తీర్పువచ్చిన అనంతరం తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
సమ్మే ఆపేది లేదంటున్న జూడాలు
ఈ సమావేశంలో పాల్గొన్న విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ వైద్యం ప్రవేట్ పరం కావడం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ప్రజా మద్దతు లేని నిరసన వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని.. పేద రోగులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
సమ్మే ఆపేది లేదంటున్న జూడాలు
ఇది ఇలా ఉంటే నెలరోజులుగా విధులను బహిస్కరించి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను డీబార్ చేస్తామని గాంధీ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆదివారం హెచ్చరించింది. దీనికి సంబంధించి తమ కళాశాలలో చదువుతున్న విద్యార్ధులకు సంబంధించి వారి తల్లితండ్రులకు నోటీసులు జారీ చేసింది.
తక్షణమే విధులకు హాజరు కావాలని, లేకుంటే డీబార్ చేస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది. తమకు నోటీసులు అందినట్లు గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన పలువురి తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు.