3 క్యాటగిరీలుగా కరీంనగర్, షాపుల కోసం సరి బేసి సంఖ్య విధానం: మున్సిపల్ కమిషనర్
వైరస్ ప్రభావాన్ని బట్టి కేంద్ర వైద్యారోగ్యశాఖ జోన్లుగా విభజించిన సంగతి తెలిసిందే. ఆరెంజ్ జోన్లో ఉన్న కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు. సీఎం కేసీఆర్ లాటరీ లేదా సరి బేసి సంఖ్య ఆధారంగా షాపులను కేటాయించాలని సూచించారు. ఈ మేరకు బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు.
కరీంనగర్లోని మొత్తం షాపులను ఏ, బీ, సీ మూడు కేటగిరీలుగా విభజించినట్టు నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి తెలిపారు. కేటగిరి 'ఏ' లో నిత్యావసర, మద్యం, నిర్మాణ రంగానికి సంబంధించిన షాపులు ఉన్నాయని చెప్పారు. వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు వీటిని తెరిచేందుకు అనుమతి ఉంది.కేటగిరి 'బీ' లో బట్టలు, పాదరక్షల షాపులు ఉన్నాయని చెప్పారు. వీటిని తెరిచేందుకు మాత్రం సరి-బేసి సంఖ్య విధానం అమలు చేస్తామని చెప్పారు. కేటగిరి 'సీ'లో హోటల్స్, స్కూల్స్, సినిమా హాల్స్, జిమ్స్ ఉన్నాయని.. వీటిని తెరిచేందుకు అనుమతి లేదని చెప్పారు. క్యాగటిరీ ఆధారంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.