4న వన్ ఇండియా తెలుగు ఎడిటర్ పుస్తకావిష్కరణ
హైదరాబాద్: ప్రముఖ తెలంగాణ రచయిత, వన్ ఇండియా.కామ్(తెలుగు పోర్టల్) ఎడిటర్ కాసుల ప్రతాపరెడ్డి రచించిన ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకావిష్కరణ ఆదివారం(అక్టోబర్ 4న)నాడు జరగనుంది.
హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ హాజరుకానున్నారు. ఆయన చేతులమీదుగానే ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: రాజకీయ సాంస్కృతికోద్యమాలు' పుస్తకం ఆవిష్కరణ జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ తెలుగు సినీా డైరెక్టర్ నరసింగరావు, తెలంగాణ జేఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ రచయిత డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో సంగిశెట్టి శ్రీనివాస్ ప్రధాన ఉపన్యాయం చేయనున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అందర్నీ ఆహ్వానిస్తున్నట్లు ప్రతాపరెడ్డి తెలిపారు. కాగా, 'తెలంగాణ సాహిత్యోద్యమాలు' అనే మరో పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు రచయిత ప్రతాపరెడ్డి తెలియజేశారు.