ఫేస్బుక్లో కెసిఆర్ ఫాలోవర్స్ 2.75 లక్షల మంది: కెటిఆర్
హైదరాబాద్ : సమాజంపై సోషల్ మీడియా ప్రభావం గణనీయంగా ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు చెప్పారు. తాజ్కృష్ణలో సోమవారం జరిగిన ఫేస్బుక్ ఫర్ బిజినెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు.
సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని, అందులోనూ ఫేస్బుక్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రచారానికి కూడా ఫేస్బుక్ను ఫ్లాట్పామ్గా వాడుకుంటామని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేనంతగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఫాలోవర్స్ ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్కు ఫేస్బుక్లో 2.75 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని చెప్పారు.
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం చలిగల్లో మన ఊరు-మన ఎంపీ కార్యక్రమాన్ని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ఎంపీలు వస్తారని ఆమె తెలిపారు. ప్రజలందరు మీ ఊరి సమస్యలను ఎంపీలకు తెలియచేస్తే వాటంన్నిటిని మన ఊరు-మన ఎంపీ కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తారని ఆమె తెలిపారు. తెలిపారు.