కేసీఆర్, నేను సేమ్ టు సేమ్, ఇద్దరు ఒక్కటే స్థాయి అని జితేందర్ రెడ్డి సంచలనం..?
మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ సేమ్ టు సేమ్ అని కామెంట్ చేశారు. ఇంతకీ దాని అర్థం ఏంటో తెలుసా..? తాను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ చేపట్టబోతానని ఇండికేషన్స్ ఇచ్చారు. అయితే అందుకు పరిస్థితులు అనుకూలించాలని జోడించారు. పాలమూరు బీజేపీ ఎన్నికల సన్నహాక సభలో శనివారం జితేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో తాను బీజేపీలో చేరానని జితేందర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కేసీఆర్ స్థాయి పదవీ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని, అదృష్టం కలిసివస్తే బీజేపీ అధ్యక్షుడిని అవుతానని చెప్పారు. కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగితే.. తాను బీజేపీ స్టేట్ చీఫ్గా ఉండబోతానని చెప్పారు. అంతేకాదు టికెట్ రాలేదని ఎవరూ బాధపడకూడదని హితోపదేశం కూడా చెప్పారు. అందరీ గురించి పార్టీ ఆలోచిస్తుందన్నారు.
మహబూబ్నగర్లో జరుగుతున్న అభివృద్ధి తానే కారణం అని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వేలైన్, జాతీయ రహదారి విస్తరణ, సీసీఐ సెంటర్, పాస్ పోర్ట్ కౌంటర్ అన్ని తాను ఎంపీగా ఉన్నప్పుడే సాధించానని చెప్పారు. బీజేపీ అధ్యక్ష పదవీ చేపట్టబోతున్నానని.. కేసీఆర్తో సేమ్ టు సేమ్ కామెంట్లు ఇటు బీజేపీలోనూ అటు టీఆర్ఎస్లోనూ చర్చకు దారితీశాయి.