కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి ఈటెలను పరామర్శించిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం పరామర్శించారు. ఈటెల రాజేందర్ ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంత్రి ఈటెల ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని, ఆయన్ని రెండు రోజుల విశ్రాంతి అవసరమని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కారు ప్రమాదంలో గాయపడిన ఈటెల కాలుకు స్వల్ప గాయమైన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో గన్‌మెన్, డ్రైవర్‌‌లతో పాటు ఈటెల ఇద్దరు పీఏలకు కూడా గాయాలైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో ఈటెల సతీమణి దగ్గరుండి ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న ఈటెలను కేసీఆర్ కుమార్తె కవిత, సతీమణి పరామర్శించారు.

శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రి తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో వివిధ కార్యక్రమాలు ముగించుకొని కరీంనగర్‌కు వస్తున్న క్రమంలో మానకొండూర్‌ మండలం ఈదులగట్టేపల్లి వద్ద ఈటల పయనిస్తున్న ఫార్చూనర్‌ వాహనం ఓవర్‌టేక్‌ చేస్తుండగా టిప్పర్‌ ఢీకొనడంతో మంత్రి వాహనం అయిదు పల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే.

మంత్రి ఈటెలను పరామర్శించిన సీఎం కేసీఆర్

మంత్రి ఈటెలను పరామర్శించిన సీఎం కేసీఆర్

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం పరామర్శించారు. ఈటెల రాజేందర్ ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి ఈటెలను పరామర్శించిన సీఎం కేసీఆర్

మంత్రి ఈటెలను పరామర్శించిన సీఎం కేసీఆర్

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మంత్రి ఈటెల ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని, ఆయన్ని రెండు రోజుల విశ్రాంతి అవసరమని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. కారు ప్రమాదంలో గాయపడిన ఈటెల కాలుకు స్వల్ప గాయమైన సంగతి తెలిసిందే.

 మంత్రి ఈటెలను పరామర్శించిన సీఎం కేసీఆర్

మంత్రి ఈటెలను పరామర్శించిన సీఎం కేసీఆర్

ఈ ప్రమాదంలో గన్‌మెన్, డ్రైవర్‌‌లతో పాటు ఈటెల ఇద్దరు పీఏలకు కూడా గాయాలైన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో ఈటెల సతీమణి దగ్గరుండి ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న ఈటెలను కేసీఆర్ కుమార్తె కవిత, సతీమణి పరామర్శించారు

మంత్రి ఈటెలను పరామర్శించిన సీఎం కేసీఆర్

మంత్రి ఈటెలను పరామర్శించిన సీఎం కేసీఆర్

శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రి తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో వివిధ కార్యక్రమాలు ముగించుకొని కరీంనగర్‌కు వస్తున్న క్రమంలో మానకొండూర్‌ మండలం ఈదులగట్టేపల్లి వద్ద ఈటల పయనిస్తున్న ఫార్చూనర్‌ వాహనం ఓవర్‌టేక్‌ చేస్తుండగా టిప్పర్‌ ఢీకొనడంతో మంత్రి వాహనం అయిదు పల్టీలు కొట్టిన సంగతి తెలిసిందే.

English summary
Kcr Met Etela Rajender In Yashoda Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X