వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఫాంహౌస్ చర్చలు: బాబు మోహన్‌, ఓదేలుకు బుజ్జగింపు, సురేఖ, దానంపైనా..

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్ ఫాంహౌస్ చర్చలు సఫలమయ్యేనా....??

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఎప్పుడెవరు ఏ పార్టీని వీడి ఏ పార్టీలో చేరతారనే చర్చనీయాంశంగా మారింది. కాగా, టీఆర్ఎస్ విడుదల చేసిన తొలి జాబితాలో గల్లంతైన నేతలను బుజ్జగించే పనిలో పడింది ఆ పార్టీ అధిష్టానం.

కేసీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుకేసీఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

బాబు మోహన్, ఓదేలుకు బుజ్జగింపులు

బాబు మోహన్, ఓదేలుకు బుజ్జగింపులు

తొలి జాబితాలో తమ పేరు లేకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఆ నేతల రాజకీయ భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నారు. తొలి విడత జాబితాలోచోటు దక్కని బాబు మోహన్, నల్లాల ఓదేలును శుక్రవారం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కు పిలిపించుకుని మాట్లాడారు. రాజకీయ భవిష్యత్తుపై అనుమానం అవసరం లేదని, తాను అండగా ఉంటానని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ కానీ, ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.

టీడీపీతో కాంగ్రెస్ పొత్తుపై క్లారిటీ: రేపు చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ, ‘లోకేష్! బాధ్యతగా ఉండు'టీడీపీతో కాంగ్రెస్ పొత్తుపై క్లారిటీ: రేపు చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ, ‘లోకేష్! బాధ్యతగా ఉండు'

కొండా సురేఖ లేదంటే.. సారయ్యకు టికెట్

కొండా సురేఖ లేదంటే.. సారయ్యకు టికెట్

అలాగే తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో కొండా సురేఖ రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆమె విషయాన్ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె పార్టీ వీడితే వరంగల్ తూర్పు స్థానాన్ని బస్వరాజు సారయ్యకు కేటాయించే అవకాశం ఉంది.

కూతురు, కొడుకు కోసం కేకే పట్టు, దానంపైనా చర్చ..

కూతురు, కొడుకు కోసం కేకే పట్టు, దానంపైనా చర్చ..

ఇది ఇలా ఉంటే, ఖైరతాబాద్ టికెట్‌ను తన కుమార్తె విజయలక్ష్మికి లేదంటే కుమారుడు విప్లవ్ కుమార్‌కు ఇవ్వాలని కేకే పట్టుబడుతున్నట్లు సమాచారం. దానం నాగేందర్ విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అభ్యర్థులను ప్రకటించని చొప్పదండి, మల్కాజ్‌గిరి స్థానాలపైనా ఉత్కంఠ కొనసాగుతోంది.

మేడ్చల్, వికారాబాద్ వలస నేతలకే..

మేడ్చల్, వికారాబాద్ వలస నేతలకే..

ఇక మేడ్చల్, వికారాబాద్ స్థానాలను వలస నేతలకు కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మల్కాజ్‌గిరి టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎంపీ మల్లారెడ్డి ఆశిస్తున్నారు.

English summary
Telangana Caretaker CM and TRS president K Chandrasekhar Rao on Friday promised to former MLAs Babu Mohan and Nallala Odelu on political post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X