ఎర్రవల్లిలో కెసిఆర్ సతీమణి శోభ సందడి: ఫామ్ హౌస్లో కెసిఆర్
సంగారెడ్డి: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సతీమణి శోభ సోమవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దత్తత గ్రామమైన మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలో పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను పరిశీలించారు.
ఫాంహౌస్ నుంచి నే రుగా గ్రామానికి చేరుకున్న ఆమె ముందుగా బీసీ కాలనీలో, అనంతరం అక్కడి నుంచి ఎస్సీ కాలనీకి వెళ్లి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కాగా, సీఎం కేసీఆర్ సోమవారం కూడా తన ఫాంహౌ్సలోనే ఉన్నారు. రెండు రోజులుగా ఫాంహౌ్సలోనే ఉంటున్న ఆయన సోమవారం ఉదయం కొద్దిసేపు పంటలను పరిశీలిస్తూ మార్నింగ్ వాక్ చేశారు.
గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను కాన్వాయ్లో తిరుగుతూ పరిశీలించారు. సుమారు 20 నిమిషాల పాటు గ్రామంలో తిరిగి ఇళ్ల నమూనాలను, పనుల వేగవంతాన్ని పరిశీలించి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.