అడ్డమైన దొంగ చంద్రబాబుతో పొత్తా, తూ.. మీ బతుకు చెడా: కేసీఆర్ తిట్లదండకం
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలోని ప్రజాశీర్వాద సభలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఓటుకు నోటులో దొరికిన దొంగ అని, అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకుంటారా.. తూ మీ బతుకు అంటూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.
చిరంజీవితో సిద్ధం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడో లేడో: విజయశాంతి
తెలంగాణను ఆంధ్రాలో కలిపింది జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. తెలంగాణ అడిగితే విద్యార్థులను కాల్చి చంపింది ఇందిరా గాంధీ అన్నారు. తన నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజా తీర్పు కోసమే అసెంబ్లీని రద్దు చేశానని చెప్పారు. మనం 5 వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలు తెచ్చుకున్నామని చెప్పారు. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, పీఆర్సీ పెంచుతామన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి ఓ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు.
తూ.. మీ బతుకు చెడా, చంద్రబాబుతో పొత్తా
14 ఏళ్లు కొట్లాడి, ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉండి నేను కొట్లాడి తెలంగాణ తీసుకు వస్తే, మళ్లీ తెలంగాణను అమరావతికి తాకట్టు పెడతారా అని కేసీఆర్ మండిపడ్డారు. చిల్లర రాజకీయం, అధికారం కోసం టీడీపీ, కాంగ్రెస్ దోస్తీయా అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణకు అడ్డుపడిన ద్రోహి చంద్రబాబుతో జతకడతారా... తూ, మీ బతుకు చెడా... అని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు పార్టీతో సిగ్గు లేకుండా పొత్తు పెట్టుకుంటారా అన్నారు. ఎవరైతే తెలంగాణ ద్రోహియే, ఎవడైతే విద్యార్థులను పొట్టన పెట్టుకున్నాడో ఆ చంద్రబాబుతో పొత్తా అన్నారు. మీ బతుకులకు టీడీపీతో పొత్తా అన్నారు.
సిగ్గులేకుండా చంద్రబాబుతోనే, అడిగితే నేను సీట్లు ఇచ్చేవాడిని
ఏడు మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. మనకు కరెంట్ రాని సమయంలో రాక్షసానందం పొందిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అడుగడుగునా చంద్రబాబు మన ప్రాజెక్టులకు అడ్డుపడే ప్రయత్నాలు చేసారన్నారు. సిగ్గులేకుండా అలాంటి దుర్మార్గుడితో పొత్తా అన్నారు. అడిగితే నేను నాలుగు సీట్లు ఇచ్చేవాడిని కదా, మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిద్దామా అని మండిపడ్డారు.
ఓటుకు నోటులో దొరికిన అడ్డమైన దొంగ
చంద్రబాబు రూ.500 కోట్లు ఇస్తారట, మూడు హెలికాప్టర్లు సిద్ధం చేశారట అని కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓటేస్తే ఒంటికి పోవాలన్నా, రెంటికి పోవాలన్నా ఢిల్లీకి పోవాలన్నారు. కాంగ్రెస్ గులాంగిరీ మనస్తత్వానికి ఇది పరాకాష్ట అన్నారు. మేం అధికారంలోకి వచ్చిన కొత్తలో తెలంగాణను అస్థిరపరచడానికి ఓటుకు నోటు కేసులో దొరికిన అడ్డమైన దొంగ చంద్రబాబు అన్నారు. అమరావతి గులాములుగా, ఢిల్లీ గులాములుగా మిగిలిపోదామా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణ ద్రోహి అన్నారు.
బట్టేబాజ్ ఎవరో ఓటర్లు తేల్చాలి
విదేశాల నుంచి నల్లధనం తీసుకు వస్తామని, మనిషికి రూ.15 లక్షలు బ్యాంకులో వేస్తామని నరేంద్ర మోడీ, బీజేపీ చెప్పిందని, మొదట వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికి కిరాయి కడతామంటారా అని బీజేపీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్పై సెటైర్లు వేశారు. ఎన్నికల సమయంలో వచ్చి ఎన్నో కథలు చెబుతారన్నారు. చెప్పటోడు చెవిటోడు అయితే వినటోడికి సిగ్గు ఉండాలన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టేబాజ్ అనవచ్చా అని కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. మీ నోరే కాదు, నా నోరు కూడా చెడ్డనోరు అన్నారు. ఎవరు బట్టేబాజో ఓటర్లు తమ ఓటు ద్వారా చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ అధఇకారం ఆంధ్రోళ్లకు అప్పగిద్దామా అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు
కాంగ్రెస్ హయాంలోని పదేళ్ల కంటే ఈ నాలుగేళ్ల తెరాస పాలనలో ఇసుకపై ఎక్కువ ఆదాయం వచ్చిందని చెప్పారు. మళ్లీ తెరాసను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. పోచారం వ్యవసాయ మంత్రి అయ్యాక రైతులకు మేలు జరిగిందని చెప్పారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఉందని చెప్పారు. చిల్లర రాజకీయాల కోసం కొందరు ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు వేశారన్నారు. సమైక్య పాలనలో నీళ్లు, ఉద్యోగాలు మనకు రాకున్నా కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదన్నారు.