వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ మరో యాగం.. ఎందుకు.. ఎప్పుడు..

|
Google Oneindia TeluguNews

జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో చండీ యాగం చేయాలా లేక హోమం చేయాలా అన్న దానిలో క్లారిటీ లేదు.

ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కన్నెపల్లిలో యాగం చేయడానికి స్థలాన్ని పరిశీలించారు పండితులు. ఇక మేడిగడ్డ లో హోమం చేయడానికి స్థల పరిశీలన చేశారు సీఎంవో అధికారులు. ఇక ఈ నేపథ్యంలో యాగం చేస్తున్నారా హోమం చేస్తున్నారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

నీతిఆయోగ్ భేటీకి కేసీఆర్ గైర్హాజరు .. రీజన్ ఇదేనా నీతిఆయోగ్ భేటీకి కేసీఆర్ గైర్హాజరు .. రీజన్ ఇదేనా

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా మేడిగడ్డలో హోమం

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా మేడిగడ్డలో హోమం

ఎందుకంటే.. కాళేశ్వరం సమీపంలో 21న సీఎం చండీయాగం చేస్తారని పండితులు భావిస్తుండగా, మేడిగడ్డ వద్ద హోమం చేసి బ్యారేజీ గేట్లను పైకెత్తి బ్యారేజీని ప్రారంభిస్తారని అధికారులు భావిస్తున్నారు.

ఈ మేరకు సీఎంవో భద్రతా కార్యదర్శి రాజశేఖర్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ మురళీధర్‌రావుతోపాటు ఇతరఅధికారులు గురువారం మేడిగడ్డ వద్ద స్థలపరిశీలన చేశారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ముఖ్య అతిథులకు ఎక్కడెక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పించాలని దానిపై పరిశీలన జరిపారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు ముందుగా ముఖ్యమంత్రి మేడిగడ్డ కు చేరుకుంటారు కాబట్టి మేడిగడ్డ లోనే హోమం జరిపిస్తారని అధికారులు, స్థానికులు అంచనా వేస్తున్నారు.

కన్నెపల్లిలో యాగ స్థలాన్ని పరిశీలించిన సీఎం పీఎస్ , పురోహితులు

కన్నెపల్లిలో యాగ స్థలాన్ని పరిశీలించిన సీఎం పీఎస్ , పురోహితులు

ఇదిలా ఉండగా.. కాళేశ్వరం శివారులోని కన్నెపల్లి వద్ద 21న ముఖ్యమంత్రి నిర్వహించే యాగ స్థలాన్ని శుక్రవారం సీఎం పీఎస్‌ పరమేశ్వర్‌రెడ్డి, సీఎం పురోహితులు గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక్‌ శర్మ పరిశీలించారు. యాగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్‌తో చర్చించారు. ఇక దీంతో రెండు చోట్ల యాగం జరగనుంది అన్న భావన కూడా వ్యక్తమవుతోంది.

కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద, గ్రావిటీ కెనాల్‌వద్ద, అప్రోచ్‌ కెనాల్‌ దగ్గర, వ్యూపాయింట్‌ వద్ద స్థలాలను పరిశీలించారు.

రెండు చోట్లా సీఎంవో అధికారుల పరిశీలన .. ఏర్పాట్లపై అధికారుల టెన్షన్

రెండు చోట్లా సీఎంవో అధికారుల పరిశీలన .. ఏర్పాట్లపై అధికారుల టెన్షన్

కన్నెపల్లి పంప్‌హౌస్‌ ప్రారంభించడానికి ముందే సుమారు మూడు గంటలపాటు కేసీఆర్‌ యాగం చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఉదయం మేడిగడ్డలో హోమం చేసి.. మధ్యాహ్నం కాళేశ్వరం వద్ద యాగం చేయవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది . సీఎం షెడ్యూలు అధికారికంగా విడుదల కాకపోవడంతో ఏర్పాట్లు ఎక్కడ చేయాలో తెలియక అధికారులు టెన్షన్ పడుతున్నారు పడుతున్నారు. మొత్తం మీద ఏ కార్యక్రమం చేసిన సీఎం కేసీఆర్ యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ నేపథ్యంలోనే అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా కెసిఆర్ నిర్వహించే యాగాల విషయంలో క్లారిటీ లేక కాస్త టెన్షన్ పడుతున్నారు.

English summary
Kaleshwaram project to be launched on June 21 by Telangana CM KCR. There is no clarity on whether Chandi yagam should perform at the inauguration of the Kaleshwaram project, a pioneer of Northern Telangana.CMO oficials examined the site of the yagna at Kannepalli during the inauguration of the Kaleshwaram project on the 21st of this month. CMO officials have inspected the place where the worship is concerned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X