వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబులాగే కేసీఆర్ కూడా అధికారం పోగొట్టుకుంటారు .. సీపీఐ నేతల సంచలనం

|
Google Oneindia TeluguNews

సీపీఐ నేతలు నారాయణ, చాడా వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న వారు తెలంగాణా సీఎం కేసీఆర్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాగే కేసీఆర్ కూడా అధికారం కోల్పోయే రోజు వస్తుందంటూ వ్యాఖ్యానించారు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పాలక ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

సీపీ ఐ నేత నారాయణ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో అతి త్వరలో టీడీపీ పూర్తిగా కనుమరుగు అవుతుందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ కనీసం పోటీ చెయ్యలేని స్థితి అందుకు నిదర్శనం అన్నారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ ఎస్ పార్టీకి సరైన తీర్పు ఇచ్చారని చెప్పారు. ఎలాగైతే చంద్రబాబు 2019ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో, అధికారం కోల్పోయారో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అలాగే ఓటమి పాలవుతారని ఆ రోజు ఎంతో దూరంలో లేదు అన్నారు సీపీఐ నేత నారాయణ .

 KCR will lose power like Chandrababu Naidu.. CPI leaders sensation

ఇక కేంద్ర మంత్రి మండలిలో 52 మంది నేరస్థులు ఉన్నారని పేర్కొన్నారు చాడా వెంకట్ రెడ్డి . ఇక తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల మయంగా మారిందని , అప్పుల మినహా రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు ఏకం కాకపోయినా, పోరాడకపోయినా, భవిష్యత్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము అని వెంకటరెడ్డి పేర్కొన్నారు . ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది అని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

English summary
CPI leaders K Narayana and Chada Venkata Reddy participated in the celebrations of Telangana Formation Day here on Sunday. Speaking on the occasion, Narayana said, "TDP will get faded in Telangana soon and people gave perfect result for TRS in Lok Sabha elections. KCR will also lose in Telangana just the way former Chief-Minister Chandrababu Naidu lost in AP-2019 elections." Advertise With Us He further added, "There are 52 criminals among the union council of ministers." Venkata Reddy said, "Telangana is changed as a suicides state. There is no development in the state except debts. If people don't get united and fight, we may face much more troubles." He further added, "everyone has a responsibility to save democracy." A large number of CPI activists participated in the programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X