వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ వరద బీభత్సం: నెల వేతనం ఇచ్చిన కేటీఆర్, ఇంద్రకరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేరళలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు తక్షణ సాయంగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ప్రకటించింది. ఇతర ప్రజాప్రతినిధులు, సామాన్యులు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు.

కేరళ భాదితులకు తన నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. రవీంద్ర భారతిలో హైదరాబాద్ మలయాళ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేరళ వరద బాధితుల సహాయనిధి శిబిరాన్ని ప్రారంభించారు.

Kerala floods: Minister Indrakaran Reddy gives 1 month pay

ఈ సందర్భంగా మాట్లాడారు. సహాయనిధి శిబిరానికి నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. వరదల కారణంగా ఆకలితో ఆలమటిస్తున్న కేరళ ప్రజలకు ఈ సహాయనిది ద్వారా కొంత మేలు జరుగుతుందన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న మలయాళీలు తమకు తోచిన సహాయాన్ని నగదు, దుస్తులు, తినుబండారాలు, మంచి నీరు, నిత్యావసర వస్తువులు విరాళంగా ఇచ్చారు. కేరళకు ఇప్పటికే 200 లారీల నిత్యవసర వస్తువులు చేరాయని, ఇకపై దాతలు నగదు రూపంలో విరాశం ఇవ్వాలని మలయాళి అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు సహాయంగా ఇచ్చింది. తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా తన నెల వేతనాన్ని ఇచ్చారు.

English summary
Help is pouring in for flood-hit Kerala from throughout the country. Doing its bit, besides Telangana state government contributing Rs 25 cr, minister for endowment, Indrakaran Reddy said he will donate his one month’s salary for Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X