దేవేందర్ గౌడ్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కేఎల్ఆర్
హైదరాబాద్: మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు తూళ్ల దేవేందర్గౌడ్ను ఏఐసీసీ సభ్యుడు, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) శుక్రవారం నగరంలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
నిరూపిస్తే రాజకీయ సన్యాసమే: కేసీఆర్కు జానారెడ్డి సవాల్
ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై కేఎల్ఆర్, దేవేందర్గౌడ్లు అరగంటసేపు మేడ్చల్ చర్చించినట్లు తెలిసింది. తాను మేడ్చల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నానని, పొత్తులో భాగంగా టీడీపీ తనకు పూర్తిస్థాయిలో మద్దతివ్వాలని కేఎల్ఆర్ దేవేందర్గౌడ్ను కోరినట్లు తెలిసింది.
కాగా, కేఎల్ఆర్ దేవేందర్ గౌడ్ను కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే మేడ్చల్ స్థానాన్ని వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేనట్లు తెలిసింది. ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా మేడ్చల్ సీటు తమకే ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టే అవకాశముంది. పొత్తులపై స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.