వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెంట్రల్ జైలుకు హజీపూర్ సైకో కిల్లర్... విచారణ ముగింపు

|
Google Oneindia TeluguNews

కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు అభంశుభం తెలియని మైనర్ అమ్మాయిలను పోట్టనబెట్టుకున్న యాదాద్రీ జిల్లా హాజీపూర్ కిల్లర్ శ్రీనివాస రెడ్డి పోలీస్ విచారణ పూర్తయింది. దీంతో ఆరు రోజుల పాటు యాదాద్రి పోలీస్ కస్టడిలో ఉన్న శ్రీనివాస రెడ్డిని నేడు వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు..

సైకో కిల్లర్ శ్రీనివాస రెడ్డి హజీపూర్‌లో ముగ్గురు మైనర్ అమ్మాయిలను హత్యచేయగా మరోకరిని కర్నూల్ జిల్లా లాడ్జ్‌లో హత్య చేసిన సంగతి తెలిసిందే..దీంతో కొద్ది రోజుల క్రితం శ్రీనివాసరెడ్డి చేసిన హత్యలపై రాష్ట్ర్రవ్యాప్తంగా సంచనం రేపింది. ఒక దశలో హజీపూర్ గ్రామస్థులు సైకో శ్రీనివాస రెడ్డి ఇళ్లును సైతం తగులబెట్టారు. దీంతో పోలీసు కస్టడీలో ఉన్న శ్రీనివాస రెడ్డి మొత్తం నాలుగు హత్యలు చేసినట్టు నిర్ధారణకు వచ్చారు.

killer srinivas reddy has been sent to warangal central jail

కాగా శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం బయటపడిన తర్వాత ఆయన ఇంకా ఏమైన హత్యలు చేశాడా అనే అనుమానాలతో పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అయితే బయటపడ్డ నాలుగు హత్యలు మినహ ఇతర విషయాలు బయటపెట్టలేదని పోలీసులు తెలిపారు.పోలీస్ కస్టడీలో ఉన్నన్ని రోజులు మౌనంగానే ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక కస్టడికి తీసుకున్న పోలీసులు శ్రీనివాస రెడ్డిని స్పాట్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. అయితే ఉదయం పూట తీసుకెళితే గ్రామస్థులు దాడీ చేసే అవకాశాలు ఉండడంతో రాత్రీపూట తీసుకెళ్లి విచారణ జరిపారు. కాగా పోలీసుల విచారణలో శ్రీనివాస రెడ్డి మాత్రం నోరు ఆ నాలుగు మినహా మిగతా ఎమైన విషయాలపై నోరు విప్పలేదని తెలుస్తోంది.

English summary
serial killer srinivas reddy has been sent to warangal central jail.police took 6 days custody for inquiry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X